News December 31, 2024
శబరిమలలో భక్తుల రద్దీ

శబరిమల ఆలయం నిన్న తిరిగి తెరుచుకోగా భక్తుల రద్దీ కనిపించింది. పంబ వరకు భక్తుల క్యూలైన్ కొనసాగగా, దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ స్పాట్ బుకింగ్ సెంటర్ వద్ద 5గంటలకు పైగా నిరీక్షించి స్పాట్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చిందని పలువురు చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను నియంత్రించడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కౌంటర్ల సంఖ్యను పెంచకపోవడంతో నిరీక్షణ తప్పలేదని భక్తులు వాపోయారు.
Similar News
News December 29, 2025
జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు

TG: జనవరి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని BAC మీటింగ్లో నిర్ణయించారు. 4న ఆదివారం సెలవు ఉండనుంది. దీంతో కొత్త సంవత్సరంలో 5 రోజులు సమావేశాలు జరగనున్నాయి. అయితే, 15 రోజులు అసెంబ్లీని నిర్వహించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలు పక్కదారిపట్టేలా BRS, కాంగ్రెస్ వ్యవహరిస్తున్నాయని BJP రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. INC హామీలపై చర్చ జరగాలన్నారు.
News December 29, 2025
గజగజ.. రేపు కూడా కొనసాగనున్న చలి తీవ్రత!

TGలో రేపు కూడా చలి తీవ్రత కొనసాగనుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, MDK, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో 5-10 డిగ్రీల మధ్య టెంపరేచర్ నమోదవుతుందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని చెప్పింది. ఉదయం, రాత్రివేళల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటికి వెళ్తే తప్పనిసరిగా స్వెటర్లు ధరించాలని వైద్యులు సూచించారు.
News December 29, 2025
పిశాచ స్థానం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా?

ఇంటి ప్రధాన గోడకు, ప్రహరీ గోడకు మధ్య ఉండే ఖాళీ స్థలాన్ని ‘పిశాచ స్థానం’ అంటారు. ఈ స్థలం విషయంలో వాస్తు నియమాలు పాటించకపోతే ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు హెచ్చరిస్తున్నారు. ‘ప్రకృతి వనరుల సమతుల్యత దెబ్బతినడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలుంటాయి. ఇంటి నిర్మాణంలో ఈ ఖాళీ స్థలాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


