News December 31, 2024
శబరిమలలో భక్తుల రద్దీ

శబరిమల ఆలయం నిన్న తిరిగి తెరుచుకోగా భక్తుల రద్దీ కనిపించింది. పంబ వరకు భక్తుల క్యూలైన్ కొనసాగగా, దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ స్పాట్ బుకింగ్ సెంటర్ వద్ద 5గంటలకు పైగా నిరీక్షించి స్పాట్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చిందని పలువురు చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను నియంత్రించడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కౌంటర్ల సంఖ్యను పెంచకపోవడంతో నిరీక్షణ తప్పలేదని భక్తులు వాపోయారు.
Similar News
News December 13, 2025
బత్తాయిలో ఆకుముడత, మంగునల్లి కట్టడికి జాగ్రత్తలు

☛ బత్తాయిలో ఆకుముడత పురుగు రాకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి వేపనూనె 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
☛ బత్తాయిలో మంగునల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 3ml లేదా ప్రాపర్ జైట్ 1ml మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 13, 2025
డ్రీం ఫీడింగ్ గురించి తెలుసా?

డెలివరీ తర్వాత పిల్లలు చాలాకాలం రాత్రిళ్లు లేచి ఏడుస్తుంటారు. అయితే దీనికి డ్రీం ఫీడింగ్ పరిష్కారం అంటున్నారు నిపుణులు. డ్రీం ఫీడింగ్ అంటే నిద్రలోనే బిడ్డకు పాలివ్వడం. ముందు బేబీ రోజూ ఒకే టైంకి పడుకొనేలా అలవాటు చెయ్యాలి. తర్వాత తల్లి నెమ్మదిగా బిడ్డ పక్కన పడుకుని బిడ్డకు చనుబాలివ్వాలి. ఆ సమయంలో బిడ్డను మెల్లిగా ఎత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల బిడ్డ రాత్రంతా మేలుకోకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News December 13, 2025
AP న్యూస్ అప్డేట్స్

* వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఒక్కో టెంపుల్లో రూ.60కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు.
* సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ నెల 17, 18 తేదీల్లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సూపర్ సిక్స్, GSDP లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
* ఈ నెల 24న మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు.


