News December 31, 2024

శబరిమలలో భక్తుల రద్దీ

image

శబరిమల ఆలయం నిన్న తిరిగి తెరుచుకోగా భక్తుల రద్దీ కనిపించింది. పంబ వరకు భక్తుల క్యూలైన్ కొనసాగగా, దర్శనానికి 10 గంటలకు పైగా సమయం పడుతోంది. పంబ స్పాట్ బుకింగ్ సెంటర్ వద్ద 5గంటలకు పైగా నిరీక్షించి స్పాట్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చిందని పలువురు చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను నియంత్రించడానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. కౌంటర్ల సంఖ్యను పెంచకపోవడంతో నిరీక్షణ తప్పలేదని భక్తులు వాపోయారు.

Similar News

News December 23, 2025

నరమాంస తోడేలు.. తల్లి ఒడిలోని బాలుడిని ఎత్తుకెళ్లి..

image

UPలో నరమాంస తోడేళ్లు స్వైరవిహారం చేస్తున్నాయి. తాజాగా బహ్రైచ్‌(D) రసూల్‌పూర్ దారెహ్తాలో దారుణం జరిగింది. తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని పాలు పడుతుండగా మూడేళ్ల చిన్నారి అన్షుని తోడేలు నోట కరుచుకుని పారిపోయింది. తల్లి దాని వెంట పడినప్పటికీ తెల్లవారుజామున కావడంతో ఆచూకీ దొరకలేదు. కొంతదూరంలో అన్షు మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఆ జిల్లాలో తోడేళ్ల దాడిలో 12 మంది చనిపోగా 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.

News December 22, 2025

ఒక్క క్లిక్‌తో భూముల స‌మాచారం: మంత్రి

image

TG: భూ ప‌రిపాల‌న వ్య‌వ‌స్థకు సంబంధించి జ‌న‌వ‌రిలో ఆధునీక‌రించిన డిజిటల్ వ్య‌వ‌స్థను తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ‘రెవెన్యూ, స్టాంప్స్&రిజిస్ట్రేష‌న్, స‌ర్వే విభాగాలను ఒకే ప్లాట్‌ఫామ్‌ కిందకి తీసుకొచ్చి “భూభార‌తి”తో లింక్ చేస్తాం. ఆధార్‌తో లింకైన ఫోన్ నంబర్‌తో లాగిన్ అవగానే ఒక్క క్లిక్‌తో భూముల స‌మాచారం వస్తుంది. స‌ర్వే నంబ‌ర్లకు మ్యాప్‌ను రూపొందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News December 22, 2025

బిగ్‌బాస్ విన్నర్‌ కంటే ఇతడికే ఎక్కువ రెమ్యునరేషన్!

image

నిన్నటితో ముగిసిన బిగ్‌బాస్-9లో కళ్యాణ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అతడు రూ.35లక్షలు గెలుచుకున్నారు. అయితే 4వ స్థానంలో ఎలిమినేట్ అయిన ఇమ్మాన్యుయేల్‌.. కళ్యాణ్ కంటే ఎక్కువ మనీ అందుకున్నట్లు తెలుస్తోంది. 15వారాలకు గానూ వారానికి రూ.2.50 లక్షల చొప్పున అతడు మొత్తం రూ.35-40లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న వారిలో ముందువరుసలో ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.