News April 5, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 62,549 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు సమకూరింది.

Similar News

News November 28, 2025

హైదరాబాదీలు వీకెండ్ ప్లాన్ చేశారా?

image

నగరవాసులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీకెండ్ చిల్ అయ్యేందుకు మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్‌ పార్క్‌లో TGFDC ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఈనెల 29న సా.5 నుంచి 30న ఉ.10 గంటల వరకు నేచర్ క్యాంప్‌ నిర్వహించనున్నారు. ఇందులో టెంట్‌ పిచింగ్, టీమ్‌ బిల్డింగ్, నైట్‌ క్యాంపింగ్ ఫారెస్ట్ వాక్ వంటివి ఉంటాయి. ఇందులో అరుదైన పక్షిజాతులను చూడొచ్చు. ఆసక్తిగలవారు 73823 07476, 94935 49399లో సంప్రదించండి.

News November 28, 2025

MDK: అన్నా నేను తాగుత లేనన్నా..!

image

ఎన్నికలు రావడంతో ఉమ్మడి MDKలో మద్యంప్రియులు జాగ్రత్తలు పడుతున్నారు. నిత్యం సారా, చీప్‌లిక్కర్ తాగి జేబులు ఖాళీ చేసుకున్న వాళ్లు ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు. ‘అన్నా ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ చీప్‌లిక్కర్ తాగొద్దన్నారు’ అంటూ పెద్ద మందుకు టెండర్ పెడుతుండటంతో పోటీదారులు ఖంగు తింటున్నారు. నిన్నటి వరకు ఏదో ఒకటి తాగిన వాళ్లు ఇప్పుడు టీచర్స్, 100 పైపర్స్ వంటి బ్రాండ్లను డిమాండ్ చేస్తున్నారట.

News November 28, 2025

మిరపలో మొవ్వుకుళ్లు తెగులు లక్షణాలు

image

మొవ్వుకుళ్లు తెగులు ఆశించిన మిరప మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై వలయాలుగా మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. మొవ్వుకుళ్లు తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువవుతుంది. నీటి ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది