News April 5, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 62,549 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు సమకూరింది.

Similar News

News December 2, 2025

నడకతో అల్జీమర్స్‌ను నివారించొచ్చు: వైద్యులు

image

అల్జీమర్స్‌ను నడకతో నివారించవచ్చని కొత్త అధ్యయనంలో తేలిందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. నేచర్ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం రోజుకు 3,000–5,000 అడుగులు నడిస్తే మెదడులో అల్జీమర్స్ కారక ప్రోటీన్ల నిర్మాణం నెమ్మదిస్తుందని తేలింది. అల్జీమర్స్‌కు చికిత్స లేనప్పటికీ, నివారణ సాధ్యమని చెబుతున్నారు. నడక అనేది అత్యంత శక్తిమంతమైన నివారణ మార్గమని, నడక మొదలుపెట్టాలని సూచించారు.

News December 2, 2025

ఈ ఆపిల్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది

image

సాధారణ ఆపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచితే కొన్ని రోజులకే రుచి మారిపోతాయి. అయితే ‘కాస్మిక్ క్రిస్ప్’ అనే ఆపిల్ మాత్రం చల్లని ఉష్ణోగ్రత వద్ద కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. రుచి మారదు. అలాగే దీన్ని కోసిన తర్వాత కూడా ముక్కలు చాలా సేపటి తర్వాతే గోధుమ రంగులోకి మారతాయి. వాషింగ్టన్ స్టేట్ వర్శిటీ 20 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి దీన్ని రూపొందించింది. ఇది ఎరుపు రంగులో తీపి, పులుపుగా, ముక్కకాస్త దృఢంగా ఉంటుంది.

News December 2, 2025

పింఛన్ల రద్దు అని వైసీపీ ట్వీట్.. ఏపీ ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ

image

AP: పింఛన్లు రద్దు చేస్తున్నారని YCP చేసిన ట్వీట్‌పై ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. పెన్షన్లలో కోతలేదని.. ఈ నెల 8,000 మందికి కొత్తగా మంజూరు చేసినట్లు తెలిపింది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే రూ.50,763 కోట్లు పింఛన్లకే ఖర్చు చేసిందని పేర్కొంది. డిసెంబర్‌లో 63.25 లక్షల మందికి రూ.2,739 కోట్లు అందించిందని వెల్లడించింది. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హెచ్చరించింది.