News April 15, 2024
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 81,057 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 27,913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారికి రూ.3.80 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.
Similar News
News January 21, 2026
పగిలిన గుడ్లు తక్కువ ధరకే.. తింటే ఇబ్బందులు

పగిలిన గుడ్లను షాపుల్లో తక్కువ ధరకే విక్రయించడం తెలిసిందేగా. కాస్త పగిలిందనో, కేవలం పగుళ్లే కదా అని తీసుకెళ్లి వండుకుంటున్నారా? అయితే మీరు అనారోగ్యానికి గురికావచ్చు. ఎగ్ పెంకు పగిలిందంటే లోపలికి బ్యాక్టీరియా వెళ్లి పాడవుతాయి. చూసేందుకు, వాసన మామూలుగా ఉన్నా లోపల క్రిములు డెవలప్ అవుతాయి. కాబట్టి తక్కువ ధరకే వస్తుందని వాటిని తింటే విరేచనాలు మొదలు ఒక్కోసారి తీవ్ర అస్వస్థతకు గురికావచ్చు.
Share It
News January 21, 2026
రేపు జగన్ మీడియా సమావేశం

AP: YSRCP చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడతారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన అంశాలపై సమావేశంలో జగన్ ప్రసంగిస్తారని వివరించింది.
News January 21, 2026
నీటి నిష్క్రమణ ఏ దిశలో ఉండటం వాస్తు సమ్మతం?

ఇంటి వాడకం నీరు, వర్షపు నీరు ఈశాన్యం నుంచే వెళ్లాలని అంటారు. కానీ ఇది అన్ని దిశల ఇళ్లకు వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘పడమర/ దక్షిణం వైపు రోడ్లు ఉన్న ఇళ్లకు ఈశాన్యం లోపలి వైపు ఉంటుంది. అలాంటివారు పడమర వాయువ్యం/దక్షిణ ఆగ్నేయం దిశల నుంచి నీటిని బయటకు పంపాలి. ప్రతి దిక్కుకు ఉండే శుభ ఫలితాలనిచ్చే మూలల ద్వారా నీరు వెళ్లడం వల్ల ఎటువంటి హాని జరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


