News July 29, 2024
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనం కోసం 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 79,327 మంది భక్తులు దర్శించుకోగా.. 25,894 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు లభించింది.
Similar News
News December 6, 2025
చెలరేగిన ప్రసిద్ధ్.. ఒకే ఓవర్లో 2 వికెట్లు

SAతో ODI సిరీస్లో పేలవ బౌలింగ్తో విమర్శలు ఎదుర్కొంటున్న IND బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఎట్టకేలకు రిథమ్ అందుకున్నారు. విశాఖలో జరుగుతున్న 3వ ODIలో ఫస్ట్ 2ఓవర్లలో 27రన్స్ సమర్పించుకున్న ఆయన.. తన సెకండ్ స్పెల్లో ఒకే ఓవర్లో బ్రిట్జ్కే, మార్క్రమ్ను, అనంతరం డికాక్(106)ను క్లీన్బౌల్డ్ చేశారు. ప్రస్తుతం 7 ఓవర్లలో 52 పరుగులిచ్చి వికెట్లు పడగొట్టారు. అటు కుల్దీప్ సైతం ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశారు.
News December 6, 2025
ఇండిగో CEOపై చర్యలు, భారీ ఫైన్?

విమాన కార్యకలాపాల నిర్వహణలో ఫెయిలైన ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ను సస్పెండ్ చేసే ఆలోచనలో విమానయాన శాఖ ఉందని తెలుస్తోంది. వేల మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన సంస్థకు భారీ జరిమానా విధించడంతోపాటు ఇండిగో సర్వీసులను తగ్గించాలని ఆదేశించే అవకాశం ఉన్నట్టు సమాచారం. FDTL అమలులో నిర్లక్ష్యమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని కేంద్రం భావిస్తోంది. కాగా, ఆ రూల్ను తాత్కాలికంగా నిలిపివేసింది.
News December 6, 2025
ప్రైవేటు బిల్లులు.. చట్టాలుగా మారుతాయా?

సాధారణంగా పార్లమెంటులో మంత్రులు బిల్లులను ప్రవేశపెడతారు. కానీ ఏదైనా తీవ్రమైన అంశం చట్టంగా మారాలని భావిస్తే ఎంపీలూ <<18487853>>ప్రైవేటు<<>> బిల్లులను ప్రతిపాదించవచ్చు. దీనికి ఒక నెల ముందు స్పీకర్, ఛైర్మన్కు నోటీసు ఇవ్వాలి. 1952 నుంచి 300కు పైగా ప్రైవేటు బిల్లులు సభ ముందుకు వచ్చాయి. అయితే 14 బిల్లులే చట్టాలుగా మారాయి. వాటిలో ముస్లిం వక్ఫ్, ఇండియన్ రిజిస్ట్రేషన్, హిందూ వివాహం(సవరణ), IPC(సవరణ) బిల్లులు ముఖ్యమైనవి.


