News December 20, 2024

తాజ్‌మహల్‌కు తగ్గి, అయోధ్య రామాలయానికి పెరిగిన రద్దీ!

image

ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గినట్లు యూపీ పర్యాటకశాఖ తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధికంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు పర్యాటకులకు వచ్చేవారని, ఈ స్థానంలో అయోధ్య రామాలయం చేరిందని పేర్కొంది. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యకు 13.55 కోట్ల మంది వస్తే, తాజ్‌మహల్‌ చూసేందుకు 12.51 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు.

Similar News

News November 1, 2025

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్ పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందమూ సీఎంతో సమావేశమైంది. HYDలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని రేవంత్ కోరారు. సీఎం నివాసంలోనే ఈ భేటీ జరిగింది.

News November 1, 2025

‘గ్లోబల్ స్టార్’ కాదు ‘మెగా పవర్ స్టార్’

image

రాజమౌళి ‘RRR’ మూవీతో రామ్ చరణ్‌కు గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్‌’లో అదే ట్యాగ్‌ను మేకర్స్ ఉపయోగించారు. అయితే తాజాగా పెద్ది సినిమా పోస్టర్‌లో మెగా పవర్ స్టార్ అని కనిపించడం టీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇది మంచి నిర్ణయమని కొందరు అంటున్నారు. ట్యాగ్‌లతో వారి స్టార్‌డమ్‌కు ఎలాంటి డ్యామేజ్ ఉండదని మరికొందరు చెబుతున్నారు. మీరేమంటారు?

News November 1, 2025

సూపర్ ఫామ్‌లో కివీస్.. వరుసగా 10 వన్డే సిరీస్‌లు కైవసం

image

ODI క్రికెట్‌లో న్యూజిలాండ్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తోంది. సొంతగడ్డపై 2019 నుంచి వరుసగా 10 ODI సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఇవాళ ENGపై మూడో వన్డేలో గెలిచి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఈ ఘనత సాధించింది. మెన్స్ ODI క్రికెట్‌లో ఇది సెకండ్ లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్. చివరగా IND చేతిలో ఓడిన కివీస్ ఆ తర్వాత దూసుకుపోతోంది. కాగా 2002-07 మధ్య వరుసగా 17 వన్డే సిరీస్‌లు గెలిచిన సౌతాఫ్రికా టాప్‌లో ఉంది.