News July 5, 2025
దారుణం.. భార్య చేతిలో మరో భర్త బలి

TG: ప్రియుడి మోజులో భర్తల్ని భార్యలు చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. నారాయణపేట (D) కోటకొండకు చెందిన అంజిలప్ప(32) తన భార్య రాధ చేతిలో హత్యకు గురైన విషయం తాజాగా పోలీసుల విచారణలో బయటపడింది. రాధకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడితో ఆమె ఫోన్ మాట్లాడుతుండటం చూసి భర్త మందలించాడు. ఈ క్రమంలో గత నెల 23న మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య గొంతు నులిమి చంపినట్లు విచారణలో తేలింది.
Similar News
News July 5, 2025
వరంగల్: హాస్పిటల్ నిర్మాణ పనులపై మంత్రి సమీక్ష

వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఒక టైమ్ లైన్ పెట్టుకుని అందరూ సమన్వయంతో పని చేయాలని, నిర్ణీత సమయంలో అన్ని పనులూ పూర్తి చేయాలన్నారు. హాస్పిటల్ ప్రారంభించిన రోజు నుంచే వైద్య సేవలు అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు.
News July 5, 2025
డైట్ కోక్ అధికంగా తాగుతున్నారా?

చాలా మంది షుగర్ ఉండదనే నెపంతో డైట్ కోక్ తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, వీటిని అమితంగా సేవించడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డైట్ కోక్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. అలాగే అప్పుడప్పుడు వీటిని తాగితే హాని ఉండదని పేర్కొన్నారు. కానీ దీర్ఘకాలికంగా ఉపయోగిస్తే జీవక్రియ దెబ్బతినడంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
News July 5, 2025
భారత్, బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్ వాయిదా

భారత్, బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య ఈ ఏడాది ఆగస్టులో జరగాల్సిన వైట్ బాల్ సిరీస్ వాయిదా పడింది. దీనిని వచ్చే ఏడాది సెప్టెంబర్లో నిర్వహించనున్నట్లు BCCI ప్రకటించింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు దీనికి అంగీకారం తెలిపాయని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం IND, BAN మధ్య 3 వన్డేలు, 3 టీ20లు జరగాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సిరీస్ రద్దయ్యే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.