News May 21, 2024
అల్లర్లకు సీఎస్ జవహర్ రెడ్డే బాధ్యుడు: టీడీపీ నేతలు

APలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్ రెడ్డే బాధ్యుడని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ఈ మేరకు టీడీపీ నేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. పల్నాడు అల్లర్ల విషయంలో పోలీసులు నిజాయతీగా వ్యవహరించి ఉంటే సిట్ అవసరం ఉండేది కాదన్నారు. YCP తప్పుడు ఆరోపణలపైనా ఫిర్యాదు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో లోటుపాట్లను సీఈవో దృష్టికి తీసుకెళ్లామన్నారు.
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్లో BRS గెలుపు: మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS పార్టీ గెలుస్తుందని ‘మిషన్ చాణక్య’ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. BRSకు 41.60%, కాంగ్రెస్కు 39.43%, BJPకి 18.97% ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. షేక్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో BRSకు, యూసుఫ్గూడ, రహమత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని తెలిపింది.
News November 11, 2025
నటి సాలీ కిర్క్ల్యాండ్ కన్నుమూత

ప్రముఖ హాలీవుడ్ నటి సాలీ కిర్క్ల్యాండ్(84) కన్నుమూశారు. డిమెన్షియాతో బాధపడుతున్న ఆమె పలుమార్లు కింద పడటంతోపాటు ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారు. 1987లో Anna చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె ఆస్కార్కు నామినేట్ అయ్యారు. 1968లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాలీ 200కు పైగా చిత్రాలు, టెలివిజన్ సిరీస్లలో నటించారు. గోల్డెన్ గ్లోబ్ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించారు.
News November 11, 2025
RBIలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

ఆర్బీఐలో 120 గ్రేడ్-B ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ఫేజ్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. <


