News October 17, 2024
గ్రూప్-1 మెయిన్స్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

TG: గ్రూప్-1 పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సీఎస్ శాంతకుమారి సూచించారు. గ్రూప్-1 పరీక్షకు ఏర్పాట్లను సమీక్షించారు. మెయిన్స్కు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు. మెయిన్స్ నిర్వహణకు 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ఠ బందోబస్తుతో పాటు విస్తృత పర్యవేక్షణ ఉండాలన్నారు.
Similar News
News March 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 13, 2025
అవకాశమిస్తే రీఎంట్రీకి సిద్ధం: పుజారా

భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టెస్టు స్పెషలిస్ట్ పుజారా హింట్ ఇచ్చారు. జట్టుకు అవసరమైతే తాను ఆడేందుకు సిద్ధమని చెప్పారు. కొన్నేళ్లుగా డొమెస్టిక్, కౌంటీల్లో భారీగా పరుగులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసుల్లో టీమ్ ఇండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో పుజారాను తీసుకోవాలని అభిమానుల నుంచి డిమాండ్ వస్తోంది. 2023 WTC ఫైనల్ పుజారాకు ఆఖరు మ్యాచ్.
News March 13, 2025
SVSC ఐడియా ముందుగా ఆ హీరోకు చెప్పా: శ్రీకాంత్ అడ్డాల

వెంకటేశ్, మహేశ్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ బాక్సాఫీసు వద్ద హిట్గా నిలిచింది. ఈ సినిమా ఐడియాను ముందుగా నాగార్జునకు చెప్పినట్లు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. స్క్రిప్ట్ రెడీ చేయాల్సి ఉందని చెప్పడంతో చూద్దామన్నట్లు తెలిపారు. అదే సమయంలో సురేశ్ బాబు, వెంకటేశ్ కథ విని ఒకే చేసినట్లు వెల్లడించారు. ఆ తర్వాత వెంకీ, మహేశ్ కాంబినేషన్ కుదిరిందన్నారు.