News November 25, 2024
తెలుగు క్రికెటర్ను దక్కించుకున్న సీఎస్కే

ఐపీఎల్ మెగా వేలంలో ఏపీలోని గుంటూరు జిల్లా క్రికెటర్ షేక్ రషీద్ను చెన్నై కొనుగోలు చేసింది. రూ.30 లక్షల బేస్ ప్రైస్కే అతడిని దక్కించుకుంది. మరో తెలుగు ఆటగాడు అవనీశ్ ఆరవెల్లి అన్సోల్డ్గా మిగిలారు. ఆయనను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. అన్షుల్ కాంభోజ్ను సీఎస్కే రూ.3.40 కోట్లకు సొంతం చేసుకుంది.
Similar News
News November 16, 2025
ఎల్లుండి ఉ.10 గంటలకు..

AP: ఫిబ్రవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈనెల 18న 10AMకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20న 10AM వరకు నమోదుచేసుకోవచ్చు. లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం లోపు డబ్బు చెల్లించాలి. 21న కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ తదితర టికెట్లు, 24న శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, 25న రూ.300 టికెట్ల కోటాను రిలీజ్ చేస్తారు.
News November 16, 2025
ఫేస్ క్రీమ్ వాడుతున్నారా?

కొన్ని క్రీములను కలిపి రాయడం వల్ల అదనపు ప్రయోజనాలుంటాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..ముడతలు ఎక్కువగా ఉన్నవారు విటమిన్-సి ఉన్న క్రీములతో పాటు సన్స్క్రీన్ లోషన్ కలిపి రాయాలి. చర్మం మృదువుగా ఉండాలంటే రెటినాల్, పెప్టైడ్ క్రీములు ఎంచుకోండి. అయితే రెటినాల్ను రాత్రే రాయాలి. హైలురోనిక్ యాసిడ్తోపాటు ఏహెచ్ఎ, బీహెచ్ఎ ఉన్నవి ఎంచుకోండి. ఈ సమస్యలన్నీ తగ్గిపోయి చర్మం తాజాగా కనిపిస్తుంది.
News November 16, 2025
నా వర్క్కు పర్సనల్ నంబర్ వాడను: అదితీరావు

హీరోయిన్ అదితీరావు హైదరీ ఫొటోలను ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్స్టాలో ఓ నోట్ రిలీజ్ చేశారు. ‘ఫొటోషూట్ల పేరుతో ఫొటోగ్రాఫర్లకు దుండగులు వాట్సాప్లో నా ఫొటో పెట్టుకొని సంప్రదిస్తున్నారు. నేనెప్పుడూ నా వర్క్కు పర్సనల్ నంబర్ను వాడను. ఏదైనా నా టీమ్ చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి’ అని పేర్కొన్నారు.


