News October 28, 2024

సచివాలయ భద్రతా సిబ్బందికి CSO వార్నింగ్

image

TG: సచివాలయ భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(CSO) హెచ్చరికలు జారీ చేశారు. సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందని ప్రకటనలో తెలిపారు. పోలీసులను రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకమైన పోస్టులను లైక్, షేర్ చేయవద్దన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News October 28, 2024

DANGER ALERT: పొద్దున, సాయంత్రం బయటకెళ్తున్నారా..

image

ఎయిర్ పొల్యూషన్‌తో పెద్దలకే కాదు యువతకూ ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు పరిశోధకులు. గాల్లో పెరిగిన నైట్రోజన్ డైయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి అణువులతో లంగ్స్, హార్ట్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. హృదయ స్పందన, లయ దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్‌కు దారితీస్తుందన్నారు. AP, TGలో AQI లెవల్స్ పెరుగుతుండటంతో పొద్దున, సాయంత్రం ఆఫీస్ పనిపై బయటకెళ్తున్నవారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

News October 28, 2024

విద్యుత్ ఛార్జీల పెంపు లేదు: ఈఆర్సీ

image

TG: డిస్కంల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది. 800 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్ ఛార్జీలు రూ.10 నుంచి రూ.50కి పెంచేందుకు ప్రతిపాదనలు చేయగా నిరాకరించింది. ఎనర్జీ ఛార్జీలు ఏ కేటగిరిలోనూ పెంచట్లేదని పేర్కొంది. సుధీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

News October 28, 2024

ధరల భారంతో నష్టాల్లో FMCG మార్కెట్!

image

Nifty FMCG స్టాక్స్ నేల‌చూపులు చూస్తున్నాయి. గ‌త ఆరేళ్ల‌లో లేని విధంగా Octలో ఇండెక్స్ 9.6% న‌ష్ట‌పోయింది. Sep Q2 ఫ‌లితాలు కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో ఇన్వెస్ట‌ర్ల‌లో ఆందోళన నెల‌కొంది. క‌మోడిటీల‌ అధిక ధ‌ర‌ల‌తో అర్బ‌న్ ప్రాంతాల్లో అమ్మ‌కాలు తగ్గ‌డం ఈ ప‌రిశ్ర‌మ మీద భారం మోపిన‌ట్టు తెలుస్తోంది. భ‌విష్య‌త్తు ఫ‌లితాల‌పై కంపెనీలు ఆచితూచి మాట్లాడుతుండ‌డం కూడా సెంటిమెంట్‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చిన‌ట్టైంది.