News February 28, 2025
CT: మరో సంచలనమా?.. దాసోహమా?

మొన్న ENGను చిత్తు చేసిన అఫ్గాన్ ఇవాళ AUSతో పోరుకు సిద్ధమవుతోంది. మ.2.30 గంటలకు ఇరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా ఓడిన టీమ్ ఇంటిబాట పట్టనుంది. ENGను ఓడించి ఊపులో ఉన్న AFG.. AUSను కూడా కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. కానీ అది అంత ఈజీ కాదు. ICC టోర్నీలంటే రెచ్చిపోయే AUS.. AFGపై విరుచుకుపడే అవకాశం ఉంది. మరి మరో సంచలనం నమోదవుతుందో? AUSకు AFG దాసోహం అవుతుందో?
Similar News
News February 28, 2025
ఆసియాలో సెకండ్ బెస్ట్ టీమ్ పాక్ కాదు అఫ్గానే!

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పాతాళానికి పడిపోయింది. ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టు ఆటతీరు దారుణంగా తయారైంది. చివరి మూడు ఐసీసీ ఈవెంట్లలో (2023 వన్డే ప్రపంచకప్ నుంచి) ఎక్కువ విజయాలు సాధించిన ఆసియా జట్లలో భారత్ (20) టాప్లో ఉంది. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ (10), పాకిస్థాన్ (6), బంగ్లాదేశ్ (5), శ్రీలంక (3) ఉన్నాయి. దీంతో ఇక నుంచి ఆసియాలో సెకండ్ బెస్ట్ జట్టు అఫ్గాన్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు.
News February 28, 2025
అంతరిక్ష యాత్రకు జెఫ్ బెజోస్ గర్ల్ఫ్రెండ్

అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ప్రియురాలు లారెన్ సాంచెజ్ అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బ్లూ ఆరిజిన్ చేపట్టనున్న స్పేస్ ట్రిప్కు మరికొందరు మహిళలతో కలిసి ఆమె వెళ్లనున్నారు. ఐషా బో, కరియాన్నే ఫిన్, గాలే కింగ్, అమాండా గుయేన్, కేటీ పెర్రీలతో కలిసి ఆమె అంతరిక్షంలో విహరించనున్నారు. కాగా జెఫ్ బెజోస్కే చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ 2021 నుంచి సంపన్న పర్యాటకులను స్పేస్ ట్రిప్కు తీసుకెళ్తున్న విషయం తెలిసిందే.
News February 28, 2025
పెన్షన్ పంపిణీలో మార్పులు

AP: ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందిస్తున్న పెన్షన్ల పంపిణీ సమయానికి సంబంధించి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అధికారుల ఒత్తిడితో చాలా మంది తెల్లవారుజామున 4 నుంచే పంపిణీ చేస్తుండగా ఉద్యోగులతో పాటు ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. ఆ సమయానికే యాప్ పని చేసేలా మార్పులు చేసింది.