News February 19, 2025
CT: విధ్వంస వీరుడి ఖాతాలో అత్యధిక రన్స్

మెగా టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు WI మాజీ ప్లేయర్ గేల్ పేరిట ఉంది. 17 మ్యాచుల్లో 3 సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో 791 పరుగులు చేశారు. తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(742), ధవన్(701), సంగక్కర(683), గంగూలీ(665) ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ప్లేయర్లలో కోహ్లీ(529), రోహిత్(481) పరుగులు చేశారు. మరి ఈ టోర్నీలో వీరు అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొడతారా? కామెంట్ చేయండి.
Similar News
News November 6, 2025
ఆ కప్పు టీకి భారీ మూల్యం: పాక్ Dy. PM

తాలిబన్స్తో ఓ టీ మీట్తో భారీ మూల్యం చెల్లిస్తున్నామని పాక్ Dy.PM ఇషాక్ దార్ అన్నారు. 2021లో తాలిబన్లు అధికారం పొందాక ISI మాజీ చీఫ్ హమీద్ ఆ దేశంలో పర్యటించి వారితో టీ తాగుతూ అంతా బాగుంటుందని భరోసా ఇచ్చారని విమర్శించారు. దీంతోనే PAK-AFG బార్డర్స్ తెరుచుకోగా వర్తకులతో పాటు వేలాది తాలిబన్స్ పాక్లోకి వచ్చారన్నారు. వారితో పాక్లోని మిలిటెంట్ గ్రూప్స్ రీ యాక్టివేట్ అయి తమపై బుసకొడుతున్నాయని వాపోయారు.
News November 6, 2025
బెట్టింగ్ యాప్ కేసు.. రైనా, ధవన్ ఆస్తులు అటాచ్

ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇలాంటి యాప్లకు ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వారిద్దరినీ అధికారులు విచారించారు.
News November 6, 2025
జుట్టుకు మసాజ్ చేస్తున్నారా?

ప్రస్తుతం కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనవిధానాల వల్ల చాలామందిలో జుట్టు ఎక్కువగా రాలుతోంది. అలాగే కాలంతో సంబంధం లేకుండా చుండ్రు సమస్య కూడా వేధిస్తుంది. వారానికోసారి హెయిర్ మసాజ్ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం వంటి వాటికి మసాజ్ చక్కటి పరిష్కారం.


