News June 26, 2024

CTR: ఉద్యోగం రాలేదని యువకుడి సూసైడ్

image

చిత్తూరు జిల్లాలో నిరుద్యోగం ఓ యువకుడి మృతికి కారణమైంది. స్థానికుల వివరాల మేరకు.. సదుం గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ(25) బీఎస్సీ అగ్రికల్చర్ చదివాడు. ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్తాపం చెందాడు. ఈక్రమంలో పాకాల మండలం వల్లివేడులోని ఓ మామిడి తోటలో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 1, 2025

చిత్తూరు పీజీఆర్ఎస్‌కు 232 అర్జీలు

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 232 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూ సర్వే శాఖకు సంబంధించి 166, పోలీస్ శాఖ-7, పంచాయతీరాజ్-4, ఎండోమెంట్-1, డీపీవో-4, విద్యాశాఖ-2, వ్యవసాయ శాఖ-4, డీఆర్డీఏకి సంబంధించి 21 ఫిర్యాదులు అందాయని వారు తెలిపారు. వీటిని సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 1, 2025

చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం

image

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 31 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను త్వరితగతిన, చట్టబద్ధంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ఇందులో బైక్ దొంగతనం-1, చీటింగ్-1, కుటుంబ/ఇంటి తగాదాలు-9, వేధింపులు-1, భూ తగాదాలు-8, డబ్బు-4, దొంగతనం-1, ఆస్తి-6. ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.

News December 1, 2025

ఆ వ్యాధి గురించి భయపడకండి: చిత్తూరు DMHO

image

చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు స్కబ్ టైపన్ కేసులు 149 నమోదయ్యాయని.. అందరూ కోలుకున్నారని DMHO సుధారాణి వెల్లడించారు. చిన్న నల్లి లాంటి ప్రాణి కుట్టడంతో ఈ వ్యాధి వస్తుందన్నారు. తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు ఉంటాయని తెలిపారు. బురదలో నడిచినప్పుడు, పొలాల్లో చెప్పులు లేకుండా తిరిగినప్పుడు ఇవి కుడుతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే యాంటి బయోటిక్స్ ద్వారా నయమవుతుందని స్పష్టం చేశారు.