News July 24, 2024

CTR: భువనేశ్వరి దత్తత గ్రామం అదే..!

image

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం కంచిబందార్లపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. ఆమె మట్లాడుతూ.. ఎక్కువ మెజారిటీ వచ్చిన బూత్‌ని తాను దత్తత తీసుకుంటానని ఎన్నికల సమయంలో చెప్పానన్నారు. మాట ప్రకారం కంచిబందార్లపల్లిని దత్తత తీసుకుంటున్నట్ల వెల్లడించారు. ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా మారుస్తానని చెప్పారు.

Similar News

News November 17, 2025

చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.

News November 17, 2025

చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.

News November 17, 2025

చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

image

చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. కార్యాలయాల చుట్టూ తిరిగిన తన భూ సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వి.కోట(M) మిట్టూరుకు చెందిన నందిని పురుగుల మందు తాగింది. అక్కడున్న మహిళా పోలీసులు వెంటనే స్పందించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.