News April 24, 2024

CTR: సమోసాలు అమ్మే వ్యక్తి నామినేషన్

image

చిత్తూరు జిల్లా పలమనేరు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా K.బాషా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఆయన సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్నది తన చిరకాల కోరికని చెప్పారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోజ్ కుమార్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నిన్న మదనపల్లెలో బజ్జీలు విక్రయించే మహిళ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

Similar News

News January 20, 2025

చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తొలగింపు

image

చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న మధుబాలను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో గ్రంథాలయ ఛైర్మన్లను నియమించారు. అయితే ఇవి నామినేటెడ్ పోస్టుల కావడంతో కొందరు ప్రభుత్వం మారిన కొనసాగుతున్నారు. దీంతో వారిని తొలగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు విడుదల చేశారు.

News January 19, 2025

చిత్తూరు: కానిస్టేబుల్ అప్పీల్ కార్యక్రమం వాయిదా

image

ఈ నెల 20వ తేదీన జరగవలసిన కానిస్టేబుల్‌ల అప్పీల్ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు.  అప్పీల్ చేయవలసిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తల్లితండ్రులు దళారులను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అలాంటివారు ఎవరైనా ఉంటే 112, 9440900005 నంబర్లకు మెసేజ్ చేయాలని కోరారు.

News January 18, 2025

CTR: పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మహిళకు గాయాలు

image

చిత్తూరు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతోంది. ఈక్రమంలో ఓ మహిళ గాయపడింది. వెంటనే రిక్రూట్మెంట్ ఇన్‌ఛార్జ్, సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న సంబంధిత సిబ్బంది ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు వాయల్పాడుకు చెందిన షకీలాగా గుర్తించారు. 1600 మీటర్ల పరుగు పందెంలో కాలుజారి కిందపడటంతో గాయపడ్డారు.