News April 15, 2024

CTR: ఛార్జింగ్ పెడుతుండగా షాక్.. వ్యక్తి మృతి

image

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజుపురం(SRపురం) మండలంలో విషాదం నెలకొంది. మండల కేంద్రానికి చెందిన హిమాచల మందడి తన గానుగ షెడ్ వద్దకు వెళ్లాడు. అక్కడ సెలఫోనుకు ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించాడు. ఈక్రమంలో కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ కుళ్లాయప్ప కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News October 7, 2025

చిత్తూరు: వర్షాలు ఎఫెక్ట్.. విద్యుత్ శాఖకు భారీ నష్టం

image

జిల్లాలోని వర్షం కారణంగా పలు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ శాఖకు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు చిత్తూరు జిల్లాలో 14 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 25 విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన వీటి మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖా అధికారి ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు.

News October 7, 2025

చిత్తూరు: బ్యానర్ల ఏర్పాటుపై ప్రిన్సిపల్‌కు మెమో

image

చిత్తూరులోని స్థానిక పీసీఆర్ కళాశాల ప్రాంగణంలో రాజకీయ పార్టీల బ్యానర్లు ఏర్పాటు చేయడంపై ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రిన్సిపల్ అబ్దుల్ మజీద్‌కు మెమో జారీ చేసింది. బ్యానర్లు ఏర్పాటుతోపాటు ప్రిన్సిపల్ ఫోటో ప్రచురించడంపై ఇంటర్మీడియట్ బోర్డు వివరణ కోరింది. కళాశాల విద్యార్థుల అర్ధ నగ్న ఫోటోలు ప్రదర్శించారని బోర్డుకు ఫిర్యాదులు అందాయి. పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది.

News October 6, 2025

స్వచ్ఛతలో అందరూ భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

image

స్వచ్ఛతలో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో సోమవారం స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి విశిష్ట అతిథిగా గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ మురళీమోహన్ హాజరయ్యారు. స్వచ్ఛతలో రాష్ట్రస్థాయిలో ఏడు అవార్డులు, జిల్లాస్థాయిలో 55 అవార్డులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.