News April 9, 2024
CTR: నిర్మాతలుగా మారిన వైసీపీ నాయకులు

హీరో సాయికుమార్ తనయుడు ఆది హీరోగా షణ్ముఖ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రాన్ని చిత్తూరు వైసీపీ నాయకులు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వైసీపీ పాలసముద్రం మండల కన్వీనర్ సప్పని తులసిరామ్, ఆయన సోదరులు షణ్ముగం యాదవ్, రమేశ్ యాదవ్ చిత్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా షణ్ముగం యాదవ్ కావడం విశేషం. వీళ్లంతా బెంగళూరులో బిల్డర్స్గా రాణిస్తున్నారు.
Similar News
News December 24, 2025
చట్టాల గురించి తెలుసుకోండి: చిత్తూరు ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఎస్సీటీ పీసీలకు జరుగుతున్న శిక్షణను ఎస్పీ తుషార్ డూడీ బుధవారం పరిశీలించారు. వారి శిక్షణ అభిప్రాయాలను తెలుసుకున్నారు. సిలబస్ అమలుపై అధికారులకు సూచనలు ఇచ్చారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని శారీరక దారుఢ్యం, మానసిక స్థైర్యం, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
News December 24, 2025
మంచి విలువలు పాటించాలి: చిత్తూరు SP

క్రిస్మస్ పండగ ప్రేమ, కరుణ, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీక అని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ చెప్పారు. సమాజంలో శాంతి నెలకొనడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మంచి విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, సుఖశాంతులు అందించాలని, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు.
News December 24, 2025
చిత్తూరు జిల్లాలో ఇతగాడితో జాగ్రత్త..!

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన కె.చంద్రబాబు(33)పై ప్రభుత్వం PD యాక్ట్ ప్రయోగించింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అమాయకులను మోసం చేస్తూ తరచూ నేరాలకు పాల్పడుతున్నాడు. రెండేళ్లలో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రజాశాంతి భద్రతలకు ముప్పుగా మారినట్లు అడ్వయిజరీ బోర్డు తేల్చింది. 12నెలలు అతడిపై పీడీ యాక్ట్ అమలు కానుంది.


