News May 27, 2024

CTR: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

జిల్లాలో ఓ ప్రేమ జంట పోలీసుల రక్షణ కోరింది. చిత్తూరుకు చెందిన రితిక, రామసముద్రం(M) సింగంవారిపల్లికి చెందిన పి.సాకేత్ కుమార్ ప్రేమించుకున్నారు. తిరుమలలో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి ప్రాణహాని ఉందని రామసముద్రం పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ చంద్రశేఖర్ రితిక తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వాళ్లు రాలేదు. చివరకు ఎస్ఐ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. రితికను బాగా చూసుకోవాలని చెప్పి వాళ్లతో పంపారు.

Similar News

News July 8, 2025

జగన్ రాక.. వైసీపీ నేతలకు నోటీసులు

image

చిత్తూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. బంగారుపాళ్యం మార్కెట్‌లో 500 మందితోనే మామిడి రైతులను పరామర్శించాలని పోలీసులు సూచించారు. ఈనేపథ్యంలో భారీ సంఖ్యలో నాయకులు బుధవారం బంగారుపాళ్యం వెళ్లకుండా ఉండేలా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా జిల్లాలోని వైసీపీ ముఖ్య నాయకులలకు మంగళవారం నుంచే నోటీసులు ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి జనసమీకరణ చేయరాదని నోటీసుల్లో పేర్కొన్నారు.

News July 8, 2025

10న చిత్తూరు జిల్లాలో PTM

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం(PTM) ఈనెల 10న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటాలని సూచించారు.

News July 7, 2025

చిత్తూరు: అంటీముట్టనట్లుగానే వైసీపీ ఇన్‌ఛార్జ్‌లు?

image

ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా నియోజకవర్గాల్లో వైసీపీ బలోపేతానికి కృషి చేయాల్సిన మాజీలు ఎక్కడా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. YCP అధికారంలో ఉన్నన్ని రోజులు చుట్టపు MLAలుగా ఉన్న ఆ నేతలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదేతరహాలో వ్యవహరిస్తున్నారట. పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె, పీలేరు, కుప్పం ఇన్‌ఛార్జ్‌లు రాష్ట్రస్థాయిలో మినహా నియోజకవర్గ కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి.