News April 25, 2024
CTR: రైలు ఢీకొని ముగ్గురి మృతి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. బెంగళూరు రైల్వే స్టేషన్లో గురువారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు… రామసముద్రం మండలం పట్రాజుపల్లికి చెందిన లోకేశ్, గంజిగానిపల్లికి చెందిన సుబ్బు, శశికుమార్ బెంగుళూరు రైల్వేస్టేషన్కు వెళ్లారు. పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు.
Similar News
News December 15, 2025
ప్రతి అంశంలో కానిస్టేబుళ్లు కీలకం: చిత్తూరు SP

ప్రజా భద్రత కోసం నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లు అహర్నిశలు పనిచేయాలని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ సూచించారు. విజయవాడలో నియామక పత్రాలు స్వీకరించనున్న 196 మంది అభ్యర్థులతో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కానిస్టేబుళ్లు చేసే కృషి మీదే శాంతి భద్రతల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి అంశంలోనూ కానిస్టేబుల్ పాత్ర కీలకమన్నారు.
News December 15, 2025
చిత్తూరులో పెరిగిన కోడిగుడ్ల ధర

చిత్తూరు జిల్లాలో కోడి గుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత నెలలో డజన్ రూ.84లకే లభించేవి. ప్రస్తుతం రూ.96కు చేరుకుంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఉత్పత్తిదారులు తెలుపుతున్నారు. అంగన్వాడీ, పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేవారు పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతున్నారు. కోళ్ల పెంపకం తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని, జనవరి అనంతరం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
News December 15, 2025
చిత్తూరు జిల్లాలో ఘోరం..!

చిత్తూరు మండలం తుమ్మిందకు చెందిన బాబు ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్. అతని భార్య కవిత ఆ బస్సులోనే హెల్పర్గా పనిచేస్తున్నారు. కవితకు ఇటీవల రూపేశ్ అనే వ్యక్తి పరిచయం కావడంతో బంగారు నగలు ఇచ్చింది. వాటిని అతను తిరిగి ఇవ్వలేనని చెప్పాడు. నగల విషయమై శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన కవిత తన కుమారుడు ముఖేష్(4)తో కలిసి గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.


