News December 30, 2024

CTR: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

image

మదనపల్లె బైపాస్‌లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు టైర్ పంచర్ కావడంతో బైకు, బంకు, చెట్టును ఢీకొట్టింది. గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్‌గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News

News February 5, 2026

తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాల పేరుతో మోసం

image

ఉద్యోగాల పేరుతో ఫోన్ కాల్స్ చేసి డబ్బులు దోచుకుంటున్న సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర హెచ్చరించారు. ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు, నెలకు రూ.32 వేల జీతమని నమ్మించి రెజ్యూమ్, ఆధార్, పొటోలు తీసుకొని ఫోన్‌పే ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద కాల్స్‌పై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మీకూ ఇలాంటి కాల్ వచ్చిందా?

News February 5, 2026

అలా చేస్తే ఆకలి చావులు తప్పవు: YS షర్మిల

image

ఉపాధి హామీని నిర్వీర్యం చేసి అందులో మిగిలిన డబ్బులను బినామీలకు, తమ నాయకులకు పంచేందుకు BJP కుట్రలు పన్నుతోందని APకాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. పుంగనూరులో గురువారం ఆమె మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని మాజీ సీఎం YSR ఎంతో ఘనంగా అమలు చేశారన్నారు. ఈ పథకం లేకపోతే వలసలు, ఆకలి చావులు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారని, ఉపాధి లేకపోతే మరింత మందికి పని ఉండదన్నారు.

News February 5, 2026

పుంగనూరు: ‘12 కోట్ల కుటుంబాల మీద ప్రభావం’

image

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ఉపాధిపై ఆధారపడ్డ 12 కోట్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతాయని మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. పుంగనూరులో గురువారం నిర్వహించిన ఉపాధి పరిరక్షణ యాత్రలో ఆయన మాట్లాడారు. పలు రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని, ఉపాధి భారం వాటి మీద మోపడంతో పనులు దొరికే అవకాశం ఉండదని ఆయన తెలిపారు. దీనిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తున్నట్టు ఆయన చెప్పారు.