News December 6, 2024
CTR : 10వ తేదీన జాబ్ మేళా
APSSDC ఆధ్వర్యంలో 10వ తేదీన చిత్తూరు పట్టణంలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధుల హాజరవుతారని తెలియజేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 23, 2025
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం: కలెక్టర్
76వ భారత గణతంత్ర వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 26న నిర్వహించే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26న పోలీసు పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
News January 22, 2025
తిరుపతి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతి నగరంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన జయ కన్నన్ ఈనెల 21న తిరుపతిలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకి తీసుకున్నారు. 22న సిబ్బంది తలుపు తట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి చూడగా పడకపైనే మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ ఎస్ఐ మహేశ్ చెప్పారు.
News January 22, 2025
చిత్తూరు జిల్లా మావోయిస్ట్.. ఇద్దరి MLAల హత్యలో పాత్ర
బలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన తవణంపల్లె మండలానికి చెందిన మావోయిస్టు చలపతి మదనపల్లెలో ఉద్యోగం ప్రారంభించారు. అనంతరం ఉద్యోగం వదిలి చిత్తూరు జిల్లా అడవుల్లో ఉద్యమాలను నడిపించారు. విశాఖ చేరుకున్నాక నక్సల్స్తో పరిచయాలు పెంచుకున్నారు. అనంతరం మావోయిస్ట్ పార్టీలో కీలకంగా ఎదిగి, మాజీ MLAలు కిడారి సర్వేశ్వర్రావు, సివేరి హత్య ఘటనతోపాటూ CM చంద్రబాబుపై బాంబు దాడిలో కీలకంగా వ్యవహరించారు.