News November 7, 2024

కరెంట్ ఛార్జీలు పెంచను: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలపై విద్యుత్ భారానికి గత ప్రభుత్వమే కారణమని, ఆ రంగంపై రూ.1.25 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ‘1998లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చా. తలసరి కరెంట్ వినియోగం పెంచా. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించా. ప్రస్తుతం ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News October 23, 2025

సముద్ర మట్టం పెరిగితే 282 గ్రామాలు ముంపు

image

AP: దేశంలో తుఫాన్లు, వరదలు వంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే ప్రాంతాల్లో ఏపీ ఒకటి. వీటివల్ల ఏటా ప్రాణ, ఆస్తి నష్టమూ ఎక్కువే. సముద్ర మట్టం పెరుగుదలతో రానున్నకాలంలో ఏపీలోని 282 తీర గ్రామాలు ముంపుబారిన పడొచ్చని తాజాగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 10L మందిని తరలించాల్సి రావచ్చంటున్నారు. ఇప్పటికే 32% తీరప్రాంతం కోతకు గురవుతున్నట్లు గుర్తించిన GOVT దీన్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపడుతోంది.

News October 23, 2025

చిన్నారులకు నాన్‌వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

image

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. ఆరునెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డును, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.

News October 23, 2025

స్వదేశీ సత్తా.. ట్రాకింగ్‌లో ‘రియా’ అద్భుతం!

image

ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ నినాద స్ఫూర్తితో BSF శిక్షణ ఇచ్చిన స్వదేశీ జాతి శునకాలు సత్తా చాటాయి. టేకాన్‌పూర్ నేషనల్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందిన ‘రియా’ అనే భారతీయ శునకం 116 విదేశీ జాతులను అధిగమించింది. ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో ‘రియా’ ఏకంగా ‘బెస్ట్ ట్రాకర్ ట్రేడ్ డాగ్’ & ‘డాగ్ ఆఫ్ ది మీట్’ అనే రెండు టైటిల్స్‌ను గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన తొలి స్వదేశీ శునకం ఇదే కావడం విశేషం.