News October 11, 2025
AIతో ‘కరెంట్ షాక్’!

భారత్ సహా ప్రపంచ దేశాలు AI వెంట పరిగెడుతున్నాయి. టెక్నాలజీ అవసరమైనా దాని వల్ల ఎలక్ట్రిసిటీ రూపంలో ఓ పెద్ద సమస్య ఉత్పన్నం కానుందనే చర్చ మొదలైంది. AI డేటా సెంటర్ల నిర్వహణకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం అవుతుంది. ఫలితంగా కరెంట్కు డిమాండ్ పెరిగి విద్యుత్ ఛార్జీలతో పాటు పవర్ కట్లు పెరుగుతాయని జోహో ఫౌండర్ శ్రీధర్ పేర్కొన్నారు. 2023 నుంచి ఏథెన్స్, జార్జియాలో 60% ఛార్జీలు పెరిగిన విషయాన్ని ఉదహరించారు.
Similar News
News October 11, 2025
చంద్రబాబుకు ప్రధాని మోదీ అభినందనలు

సీఎంగా 15 ఏళ్ల మార్కును అధిగమించిన చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన విజన్, సుపరిపాలన పట్ల ఉన్న నిబద్ధత రాజకీయ జీవితంలో స్థిరంగా కొనసాగేలా చేస్తున్నాయని కొనియాడారు. తాను సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబుతో కలిసి పనిచేసినట్లు చెప్పారు. ఏపీ సంక్షేమం కోసం ఉత్సాహంతో పనిచేస్తున్న ఆయనకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.
News October 11, 2025
ఛార్మీతో రిలేషన్పై స్పందించిన పూరీ

ఛార్మీతో తనకు ఉన్న అనుబంధంపై దర్శకుడు పూరీ జగన్నాథ్ క్లారిటీ ఇచ్చారు. తనకు 13 ఏళ్ల వయసు నుంచే ఛార్మీ తెలుసని, 20 ఏళ్ల స్నేహంతో తాము కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. పెళ్లైన మహిళతో ఉంటే ఎవరికీ సమస్య ఉండదని, ఛార్మీకి పెళ్లి కాలేదు కాబట్టే తమ మధ్య ఏదో ఉందనుకుంటున్నారని అన్నారు. స్నేహం మాత్రమే శాశ్వతమన్నారు. పూరీ నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బాధ్యతలను కొంతకాలంగా ఛార్మీ చూసుకుంటున్నారు.
News October 11, 2025
AIకి అధిక విద్యుత్ ఎందుకు అవసరం?

AI, డీప్ లెర్నింగ్ మోడల్స్ చేసే కాలిక్యులేషన్స్కు GPU, TPUల వంటి హై-పవర్ హార్డ్వేర్ అవసరం అవుతుంది. ఆ హార్డ్వేర్, వాటి నుంచి వచ్చే వేడిని తగ్గించడానికి కూలింగ్ వ్యవస్థలూ <<17977805>>హైపవర్<<>>ను డిమాండ్ చేస్తాయి. పెద్ద AI మోడల్స్ శిక్షణకు వేల గంటల పాటు హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అవసరం అవుతుంది. అలాగే డేటా సెంటర్లలోని సర్వర్లు, నెట్వర్కింగ్ సామగ్రికీ.. 24/7 AI సేవలకు అధిక విద్యుత్ కావాల్సి ఉంటుంది.