News October 27, 2024
కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదన జగన్ పాపమే: టీడీపీ

AP: ఐదేళ్ల <<14468148>>జగన్<<>> దరిద్రపు పాలనలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని TDP ఆరోపించింది. ERC ప్రతిపాదన పాపం జగన్దేనని మండిపడింది. ‘గత ప్రభుత్వం ప్రజలపై రూ.6,072 కోట్ల భారం మోపింది. జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపు ప్రతిపాదనలు. ఆ భారమంతా కూటమి ప్రభుత్వంపైనే పడింది. విద్యుత్ కొనుగోలులోనూ అక్రమాలకు పాల్పడ్డారు. చంద్రబాబు ఛార్జీలు పెంచుతామని ఎక్కడా చెప్పలేదు’ అని పేర్కొంది.
Similar News
News March 19, 2025
యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్

TG: యాదగిరిగుట్ట నరసింహస్వామి క్షేత్రాన్ని మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా దర్శించుకున్నారు. భారతీయత ఉట్టిపడేలా బొట్టు పెట్టుకొని, సంప్రదాయ చీరలో కనిపించారు. ఆలయ నిర్మాణ శైలికి ముగ్ధులయ్యారు. నరసింహుడిని దర్శించుకోవడం ఆనందాన్నిస్తోందన్నారు. కాగా చెక్ రిపబ్లికన్కు చెందిన ఈమె 2024లో టైటిల్ గెలిచారు. ఇక ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు HYDలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి.
News March 19, 2025
వడదెబ్బ తాకకుండా ఈ చిట్కాలు పాటించండి

కాటన్ వస్త్రాలను ధరించాలి, బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లండి లేదా టోఫి ధరించండి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఎండలో పనిచేసేవారు మరింత అధికంగా నీటిని తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు, పంచదార కలిపిన వాటర్ తీసుకుంటూ ఉంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకి వెళ్లకూడదు.
News March 19, 2025
ఐమాక్స్ ఫార్మాట్లో.. మోహన్ లాల్ చిత్రం

మోహన్లాల్ హీరోగా ప్రుథ్వీ రాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని మార్చి 27న ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మలయాళంలో ఐమాక్స్ ఫార్మాట్లో వస్తున్న తొలి చిత్రంగా ‘ఎల్ 2 ఎంపురాన్’ రికార్డు సృష్టించింది. ‘ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేయటం సంతోషంగా ఉందని’ ప్రుథ్యీరాజ్ Xలో పోస్ట్ చేశారు.