News May 30, 2024

కోతల్లేకుండా విద్యుత్ సరఫరా: డిస్కంల సీఎండీ

image

AP: ఫీడర్లలో సాంకేతిక సమస్యతో పలుచోట్ల గంటల తరబడి విద్యుత్ సరఫరా <<13335123>>నిలిచిపోయిందంటూ<<>> వచ్చిన వార్తలను 2 డిస్కంల CMD సంతోషరావు ఖండించారు. డిమాండ్ పెరిగినప్పటికీ నిరంతరాయంగా విద్యుత్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటం, సబ్ స్టేషన్లపై పిడుగుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి పలు చోట్ల 23-45 నిమిషాలే సరఫరా నిలిపివేశామన్నారు.

Similar News

News April 6, 2026

వర్షంతో ఆగిన మ్యాచ్

image

ఈడెన్ గార్డెన్స్‌లో KKR, PBKS మ్యాచ్ వర్షంతో ఆగింది. 3.4 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో ఆటను నిలిపేశారు. భారీ వాన పడుతుండటంతో గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి KKR స్కోర్ 25-2గా ఉంది. అలెన్ 6, గ్రీన్ 4 పరుగులు చేసి బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఔటయ్యారు.

News April 6, 2026

‘లాకప్ డెత్’.. అప్పట్లో దేశాన్ని కుదిపేసిన కేసు

image

TNలోని మదురై <<19583236>>కోర్టు<<>> తీర్పుతో లాకప్‌డెత్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. లాక్‌డౌన్‌లో షాప్స్ త్వరగా మూసివేయిస్తున్నారని జయరాజ్ చేసిన విమర్శతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నించిన కొడుకునీ లాకప్‌లో వేసి హింసించడంతో వారు చనిపోయారు. దీనిని పోలీసులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించగా నిరసనలు చెలరేగడంతో కేసును CBI టేకోవర్ చేసింది. ఐదేళ్లలో 100 మందికిపైగా సాక్షులను విచారించి కోర్టు ఈ తీర్పునిచ్చింది.

News April 6, 2026

‘అమృత్’ స్కీమ్‌లోకి పిఠాపురం.. థాంక్స్ చెప్పిన పవన్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించిందని, ఆయన అభ్యర్థన మేరకు ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్‌ను చేర్చారని Dy.CMO ట్వీట్ చేసింది. పథకంలో భాగంగా రూ.37.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారని తెలిపింది. దీంతో పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు పవన్ ధన్యవాదాలు తెలిపారు.