News March 15, 2025
వాళ్లకు కరెంట్, నీళ్లు కట్: సీఎం రేవంత్ హెచ్చరిక

TG: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CM రేవంత్ అన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి ఇళ్లకు కరెంట్, నీళ్లు కట్ చేస్తామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల విషయంలో ఎంతపెద్ద వారున్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఫాంహౌస్లలో డ్రగ్స్ పార్టీలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నామని వెల్లడించారు. కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు.
Similar News
News October 19, 2025
‘K-Ramp’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్సైట్ తెలిపింది. ఇండియాలో రూ.2.15 కోట్లు(నెట్ కలెక్షన్స్) వసూలు చేసినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 37.10% ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు వెల్లడించింది.
News October 19, 2025
తొలి వన్డే.. వర్షంతో మ్యాచ్కు అంతరాయం

పెర్త్లో జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత్ తొలి వన్డేకు వరుణుడు ఆటంకం కలిగించాడు. 9వ ఓవర్ నడుస్తుండగా వర్షం పడటంతో మ్యాచ్ ఆపేశారు. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(2), అక్షర్ పటేల్(0) ఉన్నారు. రోహిత్, కోహ్లీల తర్వాత గిల్(10) కూడా ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 25/3గా ఉంది.
News October 19, 2025
ఒకే అభ్యర్థి రెండు పార్టీల తరఫున నామినేషన్.. ఎందుకంటే?

ఒకే అభ్యర్థి 2, 3 స్థానాల్లో పోటీ చేయడం కామన్. కానీ ఒకే చోట 2 పార్టీల తరఫున పోటీ చేయడం చూశారా? బిహార్లోని ఆలమనగర్లో నబిన్ కుమార్ అనే అభ్యర్థి ముందుగా RJD తరఫున నామినేషన్ దాఖలు చేశారు. సీట్ల సర్దుబాటులో మహా కూటమి స్థానిక పార్టీ VIPకి కేటాయించింది. విషయం తెలిసి వీఐపీ నుంచి నామినేషన్ చేశారు. 2 పార్టీల తరఫున పోటీలో ఉన్నారనే ఫొటోలు వైరలవ్వడంతో RJD నుంచి నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.