News August 21, 2024

వారి పెన్షన్లు కట్!

image

AP: బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందుతున్న వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటుండగా అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించి ఇటీవల నోటీసులు జారీ చేశారు. 60వేల మందికి తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజాగా మంత్రి DBGV స్వామి సైతం బోగస్ సర్టిఫికెట్లు పెడితే పెన్షన్ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.

Similar News

News October 14, 2025

విశాఖలో మొట్టమొదటి గూగుల్ AI హబ్: సుందర్

image

డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రకటన చేశారు. ‘విశాఖపట్నంలో తొలి ఏఐ హబ్‌‌కు సంబంధించిన ప్రణాళికపై ప్రధాని మోదీతో మాట్లాడా. ఈ ఏఐ హబ్ కీలక మైలురాయి కానుంది. ఈ కేంద్రంలో గిగావాట్ సామర్థ్యం ఉండే హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇంటర్నేషనల్ సబ్‌సీ గేట్‌వే & భారీ స్థాయి ఇంధన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. దీనిద్వారా AI ఆవిష్కరణలు వేగవంతం చేస్తాం.’ అని Xలో పేర్కొన్నారు.

News October 14, 2025

RSS సమావేశాలపై బ్యాన్‌కు కర్ణాటక CM ఆదేశం

image

RSS సమావేశాలను ప్రభుత్వ సంస్థలు, స్థలాల్లో నిషేధించేలా చర్యలకు CSను ఆదేశించినట్లు కర్ణాటక CM సిద్దరామయ్య తెలిపారు. TNలో మాదిరిగా రాష్ట్రంలోనూ చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై ఆయన స్పందించారు. కాగా RSS మతం పేరిట విద్యార్థుల మనసులను కలుషితం చేస్తోందని ఖర్గే ఆరోపించారు. BJP నేతల పిల్లలు అందులో ఎందుకు ఉండరని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల్లో దాని సమావేశాలను అనుమతించబోమన్నారు.

News October 14, 2025

అరిషడ్వర్గాలను తొలగించే ఆరు నియమాలు

image

కృష్ణుడికి ఇష్టమైన కార్తీక దామోదర మాసంలో ఆయనను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. మన ప్రేమకు ఆయన బందీ అవుతాడని పండితులు చెబుతున్నారు. ప్రార్థన, మహామంత్ర జపం, దామోదర లీలా పఠనం, సాత్విక నివేదన, దీపారాధన, దామోదరాష్టకం పఠనం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని అంటున్నారు. ఈ 6 నియమాలు పాటిస్తే మనలోని అరిషడ్వర్గాలు తొలగి, శ్రీకృష్ణ కటాక్షం సిద్ధిస్తుందని పేర్కొంటున్నారు. ఇల్లు గోకులంగా వెలుగొందుతుందని అంటున్నారు.