News November 21, 2024
ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని CM చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. పోలీసుల కోసం 2వేలకు పైగా కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. పోలీస్ శాఖకు వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేస్తామని, రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్లను వదిలేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News November 19, 2025
వరి పంటకు అజొల్లా చేసే మేలు

అజొల్లా జీవన ఎరువు వరిపొలంలో నీటిపై తేలుతూ నత్రజనిని స్థిరీకరించి, వరిపైరుకు నత్రజనిని అందుబాటులోకి తీసుకొస్తుంది. వరి నాటిన వారం రోజుల తర్వాత సుమారు 2KGల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు నీటిపై పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగిస్తే ఇది 3-4 రోజుల్లో కుళ్లిపోయి నత్రజనిని, ఇతర పోషకాలను మొక్కలకు అందించి పంటకు మేలు చేస్తుంది. అజోల్లాను పచ్చిరొట్ట ఎరువుగానూ ఉపయోగించవచ్చు.
News November 19, 2025
పిల్లల్లో జలుబు తగ్గించే చిట్కాలు ఇవే

* పిల్లలను హైడ్రేట్ చేయడానికి గోరు వెచ్చని నీరు, సూప్స్, కొబ్బరి నీళ్లు ఇవ్వండి. దీనివల్ల వారి శరీరం ఎనర్జిటిక్గా ఉంటుంది. * తల కాస్త ఎత్తులో పెట్టుకుని పడుకునేలా చేయండి. * సెలైన్ నాజిల్ డ్రాప్స్ వాడండి. ఏడాది లోపు పిల్లల ముక్కులో నాలుగైదు గంటలకోసారి 2 డ్రాప్స్, అంతకంటే పెద్ద పిల్లల్లో 3-4 డ్రాప్స్ వేయండి. * విటమిన్-C ఉండే జామ, కివీ, ఆరెంజ్ పండ్లు ఇవ్వండి. దీనివల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.
News November 19, 2025
ఒకేసారి 76 మంది CRPF జవాన్లను చంపిన హిడ్మా.. ఎలా అంటే?

హిడ్మా 2010లో చేసిన దాడిని భద్రతాబలగాలు ఎప్పటికీ మర్చిపోవు. 2010 ఏప్రిల్ 6న ఛత్తీస్గఢ్లో దంతెవాడ జిల్లా తాడిమెట్ల అటవీప్రాంతంలో CRPF జవాన్లపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. కూంబింగ్ ముగించుకుని వస్తుండగా మందుపాతరలు పేల్చారు. వెంటనే 1,000 మందికి పైగా మావోయిస్టులు వారిని చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 76 మంది జవాన్లు మరణించారు. ఈ దాడికి నాయకత్వం వహించింది హిడ్మానే.


