News July 18, 2024

సైబర్ భద్రత.. అధికారుకు ప్రధాని కీలక సూచన

image

హ్యాకింగ్, సైబర్ మోసాల నేపథ్యంలో ప్రధాని మోదీ అధికారులకు కీలక సూచన చేశారు. పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్(కంప్యూటర్/ల్యాప్ టాప్) లాగౌట్ చేయాలని ఆయన చెప్పారని జాతీయ మీడియా కథనం పేర్కొంది. తన పని పూర్తయిన వెంటనే సిస్టమ్ లాగౌట్ చేస్తానని, సైబర్ భద్రత విషయంలో ఇది చాలా ముఖ్యమని చెప్పారు. రోజు చివర్లో అన్ని సిస్టమ్స్ లాగౌట్ అయ్యాయా? లేదా? అని చూసుకునే పనిని ఓ వ్యక్తికి అప్పగించాలని సూచించారు.

Similar News

News October 26, 2025

భారీ జీతంతో 16 ఉద్యోగాలు

image

అకాడమీ ఆఫ్ సైంటిఫిక్& ఇన్నోవేటివ్ రీసెర్చ్(AcSIR) 16 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ డైరెక్టర్, Sr మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://acsir.res.in/

News October 26, 2025

మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

image

అందంగా కనిపించాలని ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజూ కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి చర్మానికి రాసినా సమస్య తగ్గుతుంది.

News October 26, 2025

తుఫాను ఎఫెక్ట్.. TGలోనూ భారీ వర్షాలు

image

TGలోనూ ‘మొంథా’ ఎఫెక్ట్ ఉండొచ్చని HYD వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈనెల 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈనెల 29న ADB, కొమురంభీం, మంచిర్యాల, NRML, PDPL, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.