News March 18, 2024

బాధితుల అకౌంట్‌లోకి సైబర్ క్రైమ్ డబ్బులు

image

TG: సైబర్ మోసానికి గురైన బాధితుల ఖాతాల్లోకి తిరిగి డబ్బులు జమ చేసేలా ADG శిఖాగోయల్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. మోసపోయిన బాధితులు గంటలోపు 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే.. డబ్బు బదిలీ కాకుండా ఫ్రీజ్ చేస్తారు. ఫిర్యాదు చేసిన PSకు వెళ్లి అధికారి ద్వారా డబ్బు ఇప్పించాలని కోర్టులో పిల్ వేయాలి. అధికారి ఖాతాలు చెక్ చేసి.. బ్యాంకులు ఫ్రీజ్ చేశాయని గుర్తిస్తే, డబ్బును బాధితులకు ఇప్పిస్తున్నారు.

Similar News

News January 22, 2026

వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్!

image

బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు ఉండనున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27(మంగళవారం)న సమ్మె జరగనుంది. వారానికి ఐదు పని దినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఈ రోజుల్లో డిజిటల్, ఏటీఎం సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. ఏమైనా బ్యాంక్ పనులుంటే ఇవాళ, రేపు ప్లాన్ చేసుకోవడం మేలు.

News January 22, 2026

సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

image

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్‌-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్‌ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్‌స్క్రీన్‌లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.

News January 22, 2026

రేపు వసంత పంచమి.. చిన్నారులతో ఇలా చేయిస్తున్నారా?

image

వసంత పంచమి నాడు పిల్లలకు తెలుపు/పసుపు దుస్తులు ధరింపజేసి ఓంకారంతో అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతీ దేవి కటాక్షంతో విద్యాబుద్ధులు సమకూరుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘వారితో పలక, బలపం, పుస్తకాలకు పూజ చేయించాలి. తద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ‘‘సరస్వతీ నమస్తుభ్యం’’ పఠిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది’ అని చెబుతున్నారు. వసంత పంచమి పూజ, అక్షరాభ్యాస ముహూర్తం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.