News October 14, 2024

ఈ జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువ: మంత్రి నారాయణ

image

AP: చెన్నై-నెల్లూరు మధ్య ఈనెల 17న తుఫాను తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. తుఫాను పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. అన్నమయ్య, కడప, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, TRPT, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. అధికారులు ఇచ్చే సూచనలను ప్రజలు పాటించాలని కోరారు.

Similar News

News November 24, 2025

అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

image

TG: పటాన్‌చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్‌కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్‌కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.

News November 24, 2025

ఎల్లుండి ఇలా చేస్తే వివాహ సమస్యలు దూరం!

image

ఎల్లుండి సుబ్రహ్మణ్య షష్ఠి. దీనిని స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు. ఈరోజున సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్త్రోత్ర పారాయణం, వల్లీ-దేవసేన కళ్యాణం వంటివి చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇవి చేస్తే జాతక పరంగా వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, పిల్లల బుద్ధి కుశలత, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. SHARE IT

News November 24, 2025

ఇక సెలవు.. ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి

image

బాలీవుడ్ నటుడు <<18374925>>ధర్మేంద్ర<<>> (89) అంత్యక్రియలు ముగిశాయి. తొలుత ఆయన పార్థివ దేహాన్ని ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఆయన్ను కడసారి చూసేందుకు సినీతారలు, అభిమానులు భారీగా వచ్చారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సంజయ్ దత్ తదితర సినీ తారలు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు తుది నివాళులు అర్పించారు.