News March 17, 2024
చంద్రబాబును కలిసిన DA శ్రీనివాస్

దివంగత MP ఆదికేశవులు నాయుడు కుమారుడు DA శ్రీనివాస్ హైదరాబాద్లో చంద్రబాబును కలవడం ఆసక్తి మారింది. ఇటీవల ఆయన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల్లో చేరుతారని వివధ రకాలు వార్తలు వచ్చాయి. చిత్తూరులో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన శ్రీనివాస్ ఆ తర్వాత కనిపించలేదు. అప్పట్లో పెద్దిరెడ్డిని కలిసిన ఆయన నేడు చంద్రబాబుతో భేటి కావడం ఆసక్తి రేపుతోంది.
Similar News
News January 30, 2026
కుప్పంలో CM పర్యటన ఇలా..!

గుడిపల్లి(M) అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లోని హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 2గంటలకు CM చంద్రబాబు చేరుకుంటారు. 2.15గంటలకు టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం భవనం, హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 3.15గంటలకు కుప్పంలో స్వర్ణ నవదిశ సెంటర్ ప్రారంభిస్తారు. 4.30గంటలకు కంగుంది హోం స్టే, బౌల్డరింగ్ ఫెస్టివల్ ప్రాంతాన్ని పరిశీలించి 100అడుగుల జెండా ఆవిష్కరిస్తారు. తర్వాత శివపురంలోని ఇంటికి చేరుకుంటారు.
News January 30, 2026
కుప్పంలో CM పర్యటనకు సర్వం సిద్ధం

CM చంద్రబాబు 3 రోజులు కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల్లో పర్యటించనున్నారు. CM పర్యటన కోసం పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం గుంటూరు పర్యటన ముగించుకుని హెలికాప్టర్లో గుడిపల్లి (M) అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకొనున్నారు. అక్కడి నుంచి కుప్పం నియోజకవర్గ పర్యటన ప్రారంభిస్తారని అధికారికంగా సమాచారం వెలువడింది.
News January 29, 2026
చిత్తూరు: ఫిబ్రవరి 4వ వరకే ఛాన్స్.!

చిత్తూరు జిల్లాలో 4 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ తెలిపారు. 2025-28 సం.గాను ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీలోపు దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో 5వ తేదీన కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో బార్లను కేటాయిస్తారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు https://oc.hpfsproject.com వెబ్ సైట్ చూడాలన్నారు.


