News June 29, 2024
నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు: MP అర్వింద్

తన తండ్రి డి.శ్రీనివాస్ <<13529338>>మరణంపై<<>> MP ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘అన్నా అంటే నేనున్నానంటూ ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY. నా తండ్రి, నా గురువు అన్నీ నాన్నే. ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది ఆయనే. నాన్నా నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
DIHARలో 21 పోస్టులు

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్(DIHAR) 21 JRF,రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి ఎంటెక్, బీటెక్, BE, MSc, M.VSc, PhD ఉత్తీర్ణతతో పాటు NET/GATE అర్హత గలవారు డిసెంబర్ 5న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వయసు 28 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. JRFకు నెలకు రూ.37వేలు+HRA, RAకు రూ.67వేలు+HRA చెల్లిస్తారు.
News November 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 68

ఈరోజు ప్రశ్న: మహాభారతం ప్రకారం.. మూడే మూడు బాణాలతో కురుక్షేత్రాన్ని ముగించగల సత్తా ఉన్న యోధుడు ఎవరు? ఆయన యుద్ధంలో పాల్గొనకపోవడానికి గల కారణాలేంటి?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 16, 2025
రాజ్యసభలో పెరగనున్న NDA బలం

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో రాజ్యసభలో NDA బలం పెరగనుంది. రాష్ట్రంలో ఐదింటికి వచ్చే ఏడాది, మిగతా 5 స్థానాలకు 2028లో ఎలక్షన్ జరగాల్సి ఉంది. వీటన్నింటినీ NDA చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రతిపక్ష RJD తన 3 సీట్లను కోల్పోనుంది. ఒక సీటును నిలబెట్టుకోవాలంటే కనీసం 42 మంది MLAలు ఉండాలి. కానీ RJD గెలిచింది 25 సీట్లే. 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో ఎన్డీయేకు 133 మంది ఎంపీలు ఉన్నారు.


