News March 6, 2025

ఒకే వేదికపై దగ్గుబాటి, చంద్రబాబు

image

AP: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత తోడల్లుళ్లు ఒకే వేదికపై కనిపించారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, దగ్గుబాటి సతీమణి, ఎంపీ పురందీశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 6, 2025

వరుసగా రెండో రోజూ స్టాక్‌మార్కెట్లు అదుర్స్

image

స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండోరోజూ భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 22,544 (+207), సెన్సెక్స్ 74,340 (+609) వద్ద ముగిశాయి. క్రూడాయిల్ ధరలు తగ్గడం, పాజిటివ్ సెంటిమెంటు పెరగడమే ఇందుకు కారణాలు. రియాల్టీ సూచీ తగ్గింది. O&G, మెటల్, ఎనర్జీ, కమోడిటీస్, PSE, ఫార్మా, ఇన్ఫ్రా, హెల్త్‌కేర్, FMCG షేర్లు ఎగిశాయి. ఏషియన్ పెయింట్స్, కోల్ఇండియా, హిందాల్కో, BPCL, NTPC టాప్ గెయినర్స్. TECHM, BEL, ట్రెంట్ టాప్ లూజర్స్.

News March 6, 2025

రాహుల్‌ను స్పేర్ టైర్ కంటే దారుణంగా వాడారు: సిద్ధూ

image

భారత క్రికెటర్ KL రాహుల్‌పై మాజీ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. కెప్టెన్ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలని కోరినా సిద్ధంగా ఉండే నిస్వార్థమైన ప్లేయర్ అన్నారు. T20ల్లో ఓపెనర్‌గా, BGTలో పేసర్లను ఎదుర్కొనేందుకు 3వ స్థానంలో, CTలో కీపింగ్‌తో పాటు 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలా రాహుల్‌ను స్పేర్ టైర్‌ కంటే దారుణంగా వాడారని మేనేజ్‌మెంట్‌కు సెటైర్ వేశారు.

News March 6, 2025

భయం.. భయం: అంతుచిక్కని వ్యాధితో నెలలో 13 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్, సుక్మా జిల్లాలోని ధనికోర్టాలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు భయపడుతున్నారు. చెస్ట్ పెయిన్, దగ్గుతో ఇక్కడ నెల రోజుల్లోనే 13 మంది చనిపోయారు. వ్యాధేంటో, దాని కారణాలేంటో తెలియక వైద్యాధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. సీజన్ మారడం, ఇప్పపూల కోసం రోజంతా అడవిలో పనిచేసి డీహైడ్రేషన్‌తో చనిపోతున్నారని వారు భావిస్తున్నారు. క్యాంపు వేసి ORS ఇస్తూ అవే లక్షణాలున్న బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

error: Content is protected !!