News July 3, 2024

వైఎస్ జగన్ కేసులపై రోజువారీ విచారణ: హైకోర్టు

image

TG: సీబీఐ కోర్టులో ఉన్న ఏపీ మాజీ సీఎం జగన్ కేసులపై రోజువారీ విచారణ జరగాలని తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశించింది. ఆ కేసుల అంశంపై మాజీ మంత్రి హరిరామజోగయ్య గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. చాలా కేసులున్న కారణంగా వీలైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలని సూచించింది.

Similar News

News November 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 17, 2025

భారత్‌పై పాకిస్థాన్ విజయం

image

ACC మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నీలో ఇండియా-Aపై పాకిస్థాన్-A విజయం సాధించింది. IND-A నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఛేదించింది. పాక్ ఓపెనర్ సదాఖత్ 4 సిక్సులు, 7 ఫోర్లతో 79* పరుగులు చేశారు. యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. కాగా టాస్ సమయంలో పాక్ కెప్టెన్‌కు భారత కెప్టెన్ జితేశ్ శర్మ <<18306948>>షేక్ హ్యాండ్<<>> ఇవ్వకపోవడం గమనార్హం.

News November 17, 2025

పాలనలో తెలుగును ప్రోత్సహించాలి: వెంకయ్య

image

భాష పోతే మన శ్వాస పోయినట్లేనని, తెలుగు పోతే మన వెలుగు పోయినట్లేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. అదే సమయంలో హిందీని వ్యతిరేకించడంలో అర్థం లేదన్నారు. మన ఎదుగుదలకు హిందీ కూడా ఎంతో అవసరమని తెలిపారు. రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. పాలనలో తెలుగును ప్రోత్సహించాలని, అన్ని ఆదేశాలూ తెలుగులోనే ఇచ్చేలా చొరవ తీసుకోవాలి AP, TG సీఎంలను కోరారు.