News August 5, 2024
కొన్న రెండ్రోజుల్లోనే పాడైన బైక్.. OLAకి భారీ జరిమానా!

‘OLA’ కంపెనీకి జిల్లా వినియోగదారుల కోర్టు భారీ జరిమానా విధించింది. సదరు కంపెనీకి చెందిన స్కూటర్ను జహీరాబాద్కు చెందిన మద్ది డేవిడ్ జులై 3, 2023న కొనుగోలు చేశారు. రెండు రోజులకే పాడవడంతో కంపెనీని సంప్రదించగా సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. దీంతో అతను సంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన కోర్టు కస్టమర్కు రూ.1,92,205 చెల్లించాలని కంపెనీని తాజాగా ఆదేశించింది.
Similar News
News February 10, 2026
ఉపవాసంతో ఎన్ని ప్రయోజనాలో..

ఉపవాసంతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభించి అజీర్ణం తొలగుతుంది. శరీరంలోని విషతుల్యాలు, మాలిన్యాలు వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. ఊపిరితిత్తులలోని నీరును, గుండె చుట్టూ ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా శ్వాసక్రియ మెరుగుపడుతుంది. కాలేయ పనితీరు మెరుగుపడి చర్మం కాంతివంతంగా మారుతుంది. జలుబు, జ్వరాల వంటి వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవడానికి ఇదొక సహజ చికిత్సలా పనిచేస్తుంది.
News February 10, 2026
BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల శాలరీలివే!

భారత క్రికెట్ జట్టు ప్లేయర్లకు <<19095739>>BCCI<<>> తాజాగా 3 గ్రేడ్లలో చోటు కల్పించిన విషయం తెలిసిందే. గ్రేడ్-Aలో ఉన్న ఆటగాళ్లకు రూ.5కోట్లు చెల్లించనుంది. గ్రేడ్-B క్రికెటర్లకు రూ.3 కోట్లు, గ్రేడ్-C క్రికెటర్లకు రూ. కోటి చొప్పున ఇవ్వనుంది. దీంతో పాటు మ్యాచ్ ఫీజులు అదనం. తాజా కాంట్రాక్ట్లో గ్రేడ్-Bకు డిమోట్ అయిన రోహిత్, విరాట్ రూ.3 కోట్ల చొప్పున అందుకోనున్నారు. గతంలో ఉన్న A+ గ్రేడ్ను BCCI తొలగించింది.
News February 10, 2026
ఉపవాసం: ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?

ఉపవాసం శ్రేష్ఠమైనదే అయినా అందరికీ వర్తించదు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మధుమేహం, రక్తహీనత, గుండె జబ్బులు ఉన్నవారు సుదీర్ఘ సమయం ఆహారం మానేస్తే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. స్థూలకాయులు, BP, చర్మ వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహాతో ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.


