News December 10, 2024
దమ్ముంటే లోకేశ్తో చర్చకు రా: మంత్రి వాసంశెట్టి

AP: వైసీపీ మళ్లీ గెలుస్తుందనే భ్రమలో ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆయనకు దమ్ముంటే మంత్రి లోకేశ్తో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అప్పుడే ఎవరి గొప్ప ఏంటో తెలుస్తుందన్నారు. వైసీపీకి ఒక్క అవకాశం ఇస్తే ఏమైందో ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు.
Similar News
News January 25, 2026
కళ్లు ఇలా ఉంటే కిడ్నీ సమస్యలు!

కళ్లు ఎర్రబడటం, అలసట, ఎలర్జీ, ఇన్ఫెక్షన్ కిడ్నీ సమస్యలను సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్లూ, ఎల్లో రంగులను సరిగ్గా గుర్తించలేవు. డబుల్, బ్లర్ విజన్, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బందులు కలుగుతాయి. కళ్లు పొడిబారడం, దురద సమస్యలు ఎదురవుతాయి. యూరిన్లో ప్రొటీన్ లీకై కళ్ల చుట్టూ ద్రవం పేరుకుపోయి ఉబ్బినట్టు కనిపిస్తాయి. యూరిన్లో నురుగు లేదా బుడగలు ఉన్నా కిడ్నీల పనితీరు సరిగ్గా లేదని గుర్తించాలి.
News January 25, 2026
విడాకులు తీసుకున్న సీరియల్ నటులు

టీవీ సీరియల్ కపుల్ అనూష హెగ్డే, ప్రతాప్ సింగ్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అనూష IGలో తెలియజేశారు. పరస్పర అంగీకారంతో తాము చట్టపరంగా 2025లోనే విడిపోయామని తాజా పోస్టులో పేర్కొన్నారు. శశిరేఖ పరిణయం, కుంకుమ పువ్వు, తేనె మనసులు తదితర సీరియల్స్లో ప్రతాప్ నటించారు. ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో అనూషతో కలిసి నటించారు. ఆ సమయంలోనే లవ్లో పడ్డారు. 2020లోనే పెళ్లి చేసుకోగా 2023 నుంచి వేరుగా ఉంటున్నారు.
News January 25, 2026
BRSలో గెలిచా.. కాంగ్రెస్తో పనిచేస్తున్నా: కడియం

TG: ఎమ్మెల్యేల అనర్హతపై వివాదం కొనసాగుతున్న వేళ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్తో పనిచేస్తున్నట్లు తెలిపారు. ‘ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రచారం చేస్తారని అంతా అడుగుతున్నారు. నేను కాంగ్రెస్కే ఓటు వేయాలని చెబుతా. రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉంటారు. ఆయనకు ఎమ్మెల్యేలతోపాటు ప్రజల సపోర్టు ఉంది’ అని చెప్పారు.


