News August 14, 2024
నిరసన పేరుతో విధ్వంస నర్తనం: హసీనా

బంగ్లాదేశ్లో నిరసన పేరుతో విధ్వంస నర్తనం జరుగుతోందని షేక్ హసీనా అన్నారు. అల్లరి మూకల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. 1975, ఆగస్టు 15న హత్యకు గురైన ఆమె తండ్రి, బంగ్లా జాతిపిత ముజీబుర్ రెహ్మాన్ సహా కుటుంబీకులకు నివాళి అర్పించారు. తన కొడుకు ట్విటర్ ద్వారా బంగ్లా పౌరులకు సందేశం పంపారు. అల్లర్లలో తనలాగే ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వారికి న్యాయం చేయాలన్నారు.
Similar News
News March 2, 2026
రైల్వేలో 22,195 జాబ్స్.. దరఖాస్తు గడువు పెంపు

రైల్వేలో 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు గడువును మార్చి 3 నుంచి మార్చి 9వ తేదీకి పొడిగించారు. అప్లికేషన్ ఫీజు చెల్లింపు గడువు మార్చి 11తో ముగియనుంది. పోస్టును బట్టి టెన్త్, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై, 18-36 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్ ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: <
News March 2, 2026
ఖమేనీకి ఎంత మంది పిల్లలో తెలుసా?

ఇజ్రాయెల్-US దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి ఒక భార్య, ఆరుగురు పిల్లలున్నారు. ఆయన భార్య పేరు మన్సౌరే ఖోజాస్తే బగెర్జాదేహ్. వీరికి 1964లో వివాహమైంది. నలుగురు కుమారులు (మోస్తఫా, మొజ్తాబా, మసౌద్, మేసమ్), ఇద్దరు కూతుళ్లు (బోష్రా, హోదా), ఏడుగురు గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీతో పాటు ఓ కూతురు, కోడలు, మనుమరాలు, అల్లుడు కూడా మరణించినట్లు వార్తలొచ్చాయి.
News March 2, 2026
సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్

గల్ఫ్ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఖలీఫాతో మాట్లాడారు. ఆ దేశాల్లో భారతీయుల భద్రత గురించి అడిగి తెలుసుకున్నారు. సౌదీ, బహ్రెయిన్పై దాడిని ఖండించారు.


