News August 14, 2024
నిరసన పేరుతో విధ్వంస నర్తనం: హసీనా

బంగ్లాదేశ్లో నిరసన పేరుతో విధ్వంస నర్తనం జరుగుతోందని షేక్ హసీనా అన్నారు. అల్లరి మూకల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. 1975, ఆగస్టు 15న హత్యకు గురైన ఆమె తండ్రి, బంగ్లా జాతిపిత ముజీబుర్ రెహ్మాన్ సహా కుటుంబీకులకు నివాళి అర్పించారు. తన కొడుకు ట్విటర్ ద్వారా బంగ్లా పౌరులకు సందేశం పంపారు. అల్లర్లలో తనలాగే ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వారికి న్యాయం చేయాలన్నారు.
Similar News
News February 19, 2026
మదనపల్లెలో బాలికపై హత్యాచారం.. రాత్రంతా మద్యం తాగుతూ..

AP: మదనపల్లెలో బాలికపై హత్యాచారం తర్వాత నిందితుడు కులవర్ధన్ నాటకమాడినట్లు తెలుస్తోంది. చిన్నారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి ‘పాప కనిపించిందా? వీధుల్లోని CC కెమెరాలను పరిశీలించండి’ అని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. పాప మృతదేహాన్ని బయటకు తరలించే వీలులేక, పోలీసులకు దొరికిపోతాననే భయంతో రాత్రంతా మద్యం తాగినట్లు సమాచారం. ఇంట్లోకి పోలీసులు రాగానే ‘నా పనైపోయింది’ అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
News February 19, 2026
రాగికి పెరుగుతున్న డిమాండ్

ఎలక్ట్రికల్, నిర్మాణ, రవాణా తదితర రంగాల్లో రాగిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాడకం విపరీతంగా పెరుగుతుండడంతో 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ 42 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకునే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రిపోర్ట్ వెల్లడించింది. సప్లైలో తగినంత వృద్ధి లేకపోతే 2040 నాటికి 10 మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడవచ్చని అంచనా. ప్రస్తుతం టన్ను కాపర్ ధర దాదాపు 13వేల డాలర్లు (₹11,80,000) ఉంది.
News February 19, 2026
ఉదయాన్నే టిఫిన్ చేయాల్సిందేనా?

బ్రేక్ఫాస్ట్ మానేయడం కేవలం బరువుపైనే కాదు.. ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవారికి గుండె జబ్బుల ముప్పు 27%, టైప్-2 డయాబెటిస్ రిస్క్ పురుషుల్లో 21%, మహిళల్లో 20% పెరుగుతోంది. ఉదయం టిఫిన్ చేయకపోతే శరీరంలో గ్లూకోజ్, లిపిడ్ కంట్రోల్ తప్పడమే కాకుండా ఇన్సులిన్ లెవెల్స్ అస్తవ్యస్తమవుతాయని తేలింది. బ్రెయిన్ ఫంక్షన్ కూడా దెబ్బతింటున్నట్లు తెలిసింది.


