News March 27, 2025
DANGER: అధికంగా సౌండ్స్ వింటున్నారా?

చుట్టూ ఉన్న ముప్పును మనం గుర్తించలేకపోతున్నాం. సౌండ్ పొల్యూషన్ ఎంతో ప్రమాదకరం. ఏళ్లుగా అధిక సౌండ్స్ వింటున్నట్లైతే అనారోగ్యపడినట్లే. ఇలాంటి వారికి గుండెపోటు, హైబీపీ, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. యూరప్లో శబ్ద కాలుష్యం కారణంగా ఏటా 12000 మంది చనిపోతుండగా లక్షల మందికి నిద్రలేమి సమస్యలొస్తున్నాయి. 55-60 డెసిబెల్స్ దాటిందంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది.
Similar News
News November 23, 2025
రేపు ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ఆయన రోడ్డు మార్గంలో ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వెళ్తారు. అక్కడ కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
News November 23, 2025
CM రేసులో నేనూ ఉన్నా: కర్ణాటక హోం మంత్రి

కర్ణాటకలో సీఎం మార్పు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడిని సీఎం చేయాలని డిమాండ్లు వస్తున్నందున తాను కూడా రేసులో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత ఈ విషయంపై AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే ఇప్పటివరకు సీఎం మార్పుపై అధిష్ఠానం చర్చించలేదన్నారు.
News November 23, 2025
బంధువుల ఇంట్లో ఏ దిశన తలపెట్టి పడుకోవాలి?

బంధువుల ఇళ్లకు వెళ్తే తూర్పు దిశన తల, పడమర దిశకు కాళ్లు పెట్టి పడుకోవడం ఉత్తమమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీని వలన సుఖ నిద్ర లభిస్తుందని అంటున్నారు. ఉదయం తేలికగా నిద్ర లేవవచ్చని తెలుపుతున్నారు. ‘ఇది తాత్కాలిక నివాసానికి, ఇతరులకు ఇబ్బంది లేకుండా అనుకున్న సమయానికి మేల్కొనడానికి దోహదపడుతుంది. మంచి విశ్రాంతి కోసం ఈ దిశను వాస్తుశాస్త్రం సిఫార్సు చేస్తుంది’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


