News October 3, 2024
DANGER: కేక్స్తో క్యాన్సర్ ముప్పు

బేకరీల్లో దొరికే కేకులు తినేవారికి షాకింగ్ న్యూస్. కర్ణాటక రాష్ట్రంలోని బేకరీల్లో దొరికే రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ వంటి కేకుల్లో క్యాన్సర్ కారకాలున్నట్లు పరీక్షల్లో తేలింది. బేకరీల్లో నుంచి సేకరించిన 235 కేక్ల నమూనాలను పరీక్షించారు. ఇందులో 12 విభిన్న రకాల క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలింది. కేకుల్లో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ క్యాన్సర్తో పాటు శారీరక, మానసిక సమస్యలకు దారితీయొచ్చని వెల్లడైంది.
Similar News
News March 3, 2025
మనసు ‘దోశే’సిన వంటకం!

తెలుగువారికి బ్రేక్ఫాస్ట్లో దోశ లేకుంటే రోజు గడవదంటే అతిశయోక్తి లేదు. దీనిలో ఎన్ని వెరైటీలున్నాయో చెప్పడానికి ఒకరోజు సరిపోదు. ప్రధానంగా ఉల్లి దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, ఎగ్ దోశ మన వద్ద ఫేమస్. దోశ వేయడమనేది తమిళనాడులో మొదలైందని అంటారు. అట్టు నుంచే దోశ పుట్టిందనేది మరో కథనం. ఏదేమైనా నేడు ప్రపంచమంతా విస్తరించిందీ వంటకం. ఈరోజు దోశ దినోత్సవం. మరి మీకు నోరూరించే దోశ ఏది? కామెంట్ చేయండి.
News March 3, 2025
3 రాజధానులపై YCP యూటర్న్?

AP: అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రానికి 3రాజధానులు అవసరమని అధికారంలో ఉన్నప్పుడు YCP బలంగా వాదించింది. విశాఖ, అమరావతి, కర్నూలును రాజధానులు చేస్తామని తేల్చి చెప్పింది. అయితే 3 రాజధానులు కార్యరూపం దాల్చలేదు. కాగా, 3 రాజధానులు అప్పటి మాట అని, ప్రస్తుతం తమ విధానం ఏంటో చర్చించుకొని చెప్తామని బొత్స అన్నారు. దీంతో YCP యూటర్న్ తీసుకుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. దీనిపై మీ COMMENT.
News March 3, 2025
రోహిత్పై కామెంట్స్.. కేంద్రమంత్రి మండిపాటు

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ <<15636715>>వ్యాఖ్యలను<<>> కేంద్ర మంత్రి మాండవీయ ఖండించారు. క్రీడాకారులను వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. షామాను సమర్థించిన TMC ఎంపీ సౌగతా రాయ్పైనా ఆయన మండిపడ్డారు. బాడీ షేమింగ్పై కాంగ్రెస్, టీఎంసీ పార్టీల నేతల మాటలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వేదికలపై మన దేశ గౌరవాన్ని పెంచే ఆటగాళ్లను కించపరిచేలా మాట్లాడటం సరికాదని మాండవీయ హితవు పలికారు.