News October 21, 2024
హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం

TG: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్తున్న సమయంలో ఓ కారు కాన్వాయ్ మధ్యలోకి వచ్చింది. దీంతో కాన్వాయ్లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్లోని మూడు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 6, 2026
పిల్లలకు తేనె ఎప్పుడు ఇవ్వాలంటే?

పిల్లలకు ఒక సంవత్సరం వయస్సు వచ్చిన తర్వాత, వారి జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది. అప్పుడు తేనె ఇవ్వడం సురక్షితం. కానీ అప్పుడు కూడా దీనిని తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఏదైనా కొత్త ఆహారం మాదిరిగా ముందుగా కొద్దిగా ప్రయత్నించి చూడాలి. పిల్లల గొంతుకు ఉపశమనం కలిగించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇచ్చే ముందు డాక్టర్ను సంప్రదించాలి. దానికి బదులు తల్లి పాలు, సూప్లు, జ్యూసులు ఇవ్వడం మంచిది.
News January 6, 2026
31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లులేని భక్తులకు దర్శనానికి 13 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 82,650మంది భక్తులు దర్శించుకున్నారు. 23,331మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న రూ.4.08కోట్ల హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.
News January 6, 2026
కిలో చికెన్ రూ.320.. మరింత పెరిగే అవకాశం!

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చికెన్ ధర స్కిన్లెస్ కిలోకి రూ.320 వరకు ఉంది. చాలాకాలంగా పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉండటంతో చాలామంది కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. డిమాండుకు తగ్గట్లు సప్లయ్ లేకపోవడం వల్లే ధరలు ఇంతలా పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అటు కోడిగుడ్డు ధర కూడా రూ.8గా ఉంది.


