News June 28, 2024
దర్శన్ అన్న అలాంటి వ్యక్తి కాదు: నాగశౌర్య

అభిమానిని క్రూరంగా హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్కు టాలీవుడ్ హీరో నాగశౌర్య మద్దతు తెలిపారు. రేణుకాస్వామి మృతిపై విచారం వ్యక్తం చేస్తూనే.. దర్శన్ కలలో కూడా ఎవరికీ హాని చేసే వ్యక్తి కాదన్నారు. ఈ విషయంలో ప్రజలు తొందరపాటుతో ఆయనను దోషిగా నిర్ధారిస్తుంటే బాధేస్తోందన్నారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, త్వరలోనే నిజం బయటికి వస్తుందని ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
Similar News
News December 12, 2025
ఈ సీజన్లోనే అత్యల్పం.. జి.మాడుగుల@3.2డిగ్రీలు

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అతి శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. నిన్న APలోని అల్లూరి(D) జి.మాడుగులలో అత్యల్పంగా 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఈ సీజన్లో ఇదే రికార్డు. డుంబ్రిగూడలో 3.6, అరకులో 3.9, ముంచంగిపుట్టులో 4.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. TGలోని ఆసిఫాబాద్(D) గిన్నెధరిలో 5.4, కెరమెరిలో 5.7, తిర్యాణిలో 5.8డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
News December 12, 2025
డెలివరీ కోసమే అయితే వీసాలివ్వం: US ఎంబసీ

తమ దేశ పౌరసత్వం కల్పించడంపై అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. USలో బిడ్డకు జన్మనివ్వడానికి టూరిస్ట్ వీసాకు అప్లై చేస్తే నిరాకరించనున్నట్లు INDలోని US ఎంబసీ తెలిపింది. USలో జన్మిస్తే సహజ సిద్ధంగా పౌరసత్వం వస్తుందని కొందరు ప్రయత్నిస్తారని, ఆ అడ్డదారులను మూసేస్తున్నట్లు తెలిపింది. పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లు సూచన ప్రాయంగా తెలిసినా అలాంటి వీసా దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు చెప్పింది.
News December 12, 2025
ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

AP: అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు <<18539107>>ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.


