News November 26, 2024

జనవరిలో వైకుంఠ ద్వారా దర్శనం.. ఆ సేవలు రద్దు

image

AP: వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలతో పాటు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలకు మాత్రం అనుమతివ్వనున్నారు.

Similar News

News November 2, 2025

ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే: KTR

image

TG: రేవంత్ నకిలీ వాగ్దానాలు, బెదిరింపు రాజకీయాలు జూబ్లీహిల్స్ ఓటమితోనే అంతమవుతాయని KTR వ్యాఖ్యానించారు. ‘500 రోజుల్లో KCR తిరిగి సీఎం అవుతారు. ఎందరో నియంతలు పతనమయ్యారు.. తర్వాత రేవంతే. జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీతో గెలుస్తాం. రేవంత్ చేసే బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పతనం ఖాయం. రేవంత్‌కు కాంగ్రెస్‌తో ఉన్నది ఫేక్ బంధం. BJPతో ఉన్న‌ది పేగు బంధం’ అని విమర్శించారు.

News November 2, 2025

BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

image

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఈజీ అశోక్ కుమార్‌ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.

News November 2, 2025

4 ప్రాంతాల్లో SIR ప్రీటెస్టు సెన్సస్

image

AP: ECI దేశవ్యాప్తంగా SIR చేపట్టాలని నిర్ణయించడం తెలిసిందే. దీనిలో భాగంగా తొలివిడత ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ ప్రీటెస్టు కోసం ఏపీలో 4 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను ఖరారు చేశారు. అల్లూరి(D) GKవీధి(M), ప్రకాశం(D) పొదిలి(NP), నంద్యాల(D) మహానంది(M), విశాఖ కార్పొరేషన్‌లోని 2, 3 వార్డులను ఎంపిక చేశారు. వీటిలో ప్రీటెస్ట్ నిర్వహణకు ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లను నియమించారు.