News October 7, 2024

మహాచండీ దేవి రూపంలో దుర్గమ్మ దర్శనం

image

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు విజయవాడ దుర్గమ్మ మహాచండీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ దేవి అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయని భక్తుల నమ్మకం. దుష్టశిక్షణ, శిష్ట రక్షణకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. మరోవైపు వరంగల్ జిల్లా భద్రకాళీ దేవస్థానంలో లలిత మహాత్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.

Similar News

News November 25, 2025

వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లు: పార్థసారథి

image

AP: ఐదేళ్లలో 15.59 లక్షల ఇళ్లు కట్టివ్వాలన్న లక్ష్యంలో ఇప్పటికే 3 లక్షలు పూర్తి చేసినట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ‘ఇళ్లులేని నిరుపేదలకు 2029కల్లా శాశ్వత గృహ వసతి కల్పిస్తాం. వచ్చే నాలుగేళ్లలో 12.59లక్షల ఇళ్లను పూర్తి చేస్తాం. ఉగాదికి 5 లక్షలు, జూన్‌కి మరో 87వేల గృహాలను పూర్తి చేయాలని పని చేస్తున్నాం. CM ఆదేశాల మేరకు 3 నెలలకోసారి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం’ అని తెలిపారు.

News November 25, 2025

ఎర్రనల్లితో పంటకు తీవ్ర నష్టం, నివారణ ఎలా?

image

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.

News November 25, 2025

అరుణాచల్ మా భూభాగం: చైనా

image

షాంఘై ఎయిర్‌పోర్టులో భారత మహిళను <<18373970>>వేధించారన్న<<>> ఆరోపణలను చైనా ఖండించింది. ‘ఎలాంటి నిర్బంధం, వేధింపులకు ఆమె గురి కాలేదు. చట్టాలు, రూల్స్‌కు అనుగుణంగానే అధికారులు వ్యవహరించారు. రెస్ట్ తీసుకునేందుకు చోటిచ్చి, ఆహారం, నీళ్లు అందజేశారు. జాంగ్‌నాన్(అరుణాచల్) చైనా భూభాగం. ఇండియా చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను మేం ఎప్పుడూ గుర్తించలేదు’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు.