News July 21, 2024

జూకంటికి ‘దాశరథి’ పురస్కారం

image

TG: ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’కు ప్రముఖ కవి జూకంటి జగన్నాథంను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేయనుంది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన జూకంటికి 30 ఏళ్లకుపైగా కవిగా, రచయితగా అనుభవం ఉంది. ఆయన మొదటి కవితా సంకలనం పాతాళ గరిగె. 1998లో తొలిసారి సినారె కవితా పురస్కారం అందుకున్నారు.

Similar News

News November 25, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 12

image

68. ఎక్కువమంది మిత్రులు ఉన్నవాడు ఏమవుతాడు? (జ.సుఖపడతాడు)
69. ఎవడు సంతోషంగా ఉంటాడు? (జ.అప్పు లేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు)
70. ఏది ఆశ్చర్యం? (జ.ప్రాణులు రోజూ మరణిస్తుండటం చూసి కూడా మనుషులు ఈ భూమ్మీద ఉండిపోతాను అనుకోవడం.)
71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? (జ.ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ వీటన్నింటినీ సమంగా చూసేవాడు) <<-se>>#YakshaPrashnalu<<>>

News November 25, 2025

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్‌లో ఉద్యోగాలు

image

బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్(<>BRIC<<>>)12 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 21వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో 6 పోస్టులను రెగ్యులర్‌గా, 6 పోస్టులను డిప్యుటేషన్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://dbtindia.gov.in

News November 25, 2025

BRSకు నిధుల కొరత.. రూ.15 కోట్లకు తగ్గిన డొనేషన్లు!

image

TG: అసెంబ్లీ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి, పార్టీ అధినేత KCR ప్రజల్లోకి రాకపోవడం, కవిత ఆరోపణలు, BJPతో విలీన రూమర్లతో రాష్ట్రంలో BRS ఇమేజ్ మసకబారిందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీకి విరాళాలు భారీగా తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 580.52 కోట్లుగా ఉన్న డొనేషన్లు, ఈ ఏడాది రూ.15 కోట్లకు పడిపోయినట్టు సమాచారం. దీంతో BRS నిధుల లేమితో ఇబ్బంది పడుతోందని టాక్.