News July 21, 2024
జూకంటికి ‘దాశరథి’ పురస్కారం

TG: ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’కు ప్రముఖ కవి జూకంటి జగన్నాథంను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేయనుంది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన జూకంటికి 30 ఏళ్లకుపైగా కవిగా, రచయితగా అనుభవం ఉంది. ఆయన మొదటి కవితా సంకలనం పాతాళ గరిగె. 1998లో తొలిసారి సినారె కవితా పురస్కారం అందుకున్నారు.
Similar News
News November 27, 2025
బహు భార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించిన అస్సాం

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధ బిల్లును అస్సాం అసెంబ్లీ ఇవాళ పాస్ చేసింది. దీని ప్రకారం 2 లేదా అంతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. వివాహం సమయలో ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి దాచిన వారికి పదేళ్ల శిక్ష పడనుంది. ‘ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. బహుభార్యత్వాన్ని ఇస్లాం అంగీకరించదు’ అని CM హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<


