News November 25, 2024
దావూద్తో ప్రాణహాని వల్లే దేశం విడిచా: లలిత్ మోదీ

దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణ హాని వల్లే దేశం విడిచినట్లు IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తెలిపారు. మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి వంటి అక్రమ వ్యవహారాలపై తనకున్న జీరో టోలరెన్స్ పాలసీ కారణంగా దావూద్ తనను టార్గెట్ చేశాడని రాజ్ షమానీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో లలిత్ వెల్లడించారు. తన హత్యకు దావూద్ వ్యూహాత్మక ప్రయత్నాలు చేశాడని, దీనిపై ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అందుకే దేశం విడిచానన్నారు.
Similar News
News November 11, 2025
అమరావతిలో MSK క్రికెట్ అకాడమీ

AP: అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి BCCI మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ భూమిపూజ నిర్వహించారు. పిచుకలపాలెం రెవెన్యూ పరిధిలో 12 ఎకరాల్లో ఈ అకాడమీ నిర్మిస్తున్నారు. ఇందులో క్రికెట్ గ్రౌండ్, ఇండోర్, అవుట్ డోర్ ట్రైనింగ్ జోన్స్, 400 మంది ప్లేయర్ల సామర్థ్యంతో ట్రైనింగ్ సెంటర్, 1000 మంది ఉండేలా స్పోర్ట్స్ రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్స్, జిమ్, ఫిజియోథెరపీ వంటి సదుపాయాలు ఉండనున్నాయి.
News November 11, 2025
డ్రైవర్ అప్రమత్తతే 29 మందిని రక్షించింది!

TG: నల్గొండలోని చిట్యాల వద్ద <<18254484>>బస్సు<<>> దగ్ధమైన ఘటనలో డ్రైవర్ అప్రమత్తతే 29 మంది ప్రయాణికులను రక్షించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగగా సకాలంలో స్పందించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. వెంటనే వారు బస్సు నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యమూ ఓ కారణమన్న సంగతి తెలిసిందే.
News November 11, 2025
‘ఓం శాంతి శాంతి శాంతిః’ అంటే అర్థం తెలుసా?

ప్రతి మంత్రాన్ని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అని ముగిస్తుంటాం. అంటే సమస్త దుఃఖాల నుంచి విముక్తి ప్రసాదించమని ఈశ్వరుడిని వేడుకోవడం. ఇందులో మూడు సార్లు ‘శాంతిః’ అని పలకడం ద్వారా మానవులను పీడించే త్రివిధ తాపాల నుంచి ఉపశమనం కోరడం. ఈ మూడు రకాల బాధలను దాటినప్పుడే మనకు మోక్షం, శాంతి లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ☞ మరి ఆ మూడు రకాల తాపాలేంటి?, వాటి నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


