News December 27, 2024
DAY 2: 5 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన జైస్వాల్(82), కోహ్లీ(36) వెంటవెంటనే ఔటయ్యారు. ప్రస్తుతం పంత్(6*), జడేజా(4*) క్రీజులో ఉన్నారు. కమిన్స్, బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు AUS 474 పరుగులు చేసింది. భారత్ ఇంకా 310 రన్స్ వెనుకబడి ఉంది.
Similar News
News October 31, 2025
WWC: ఈసారి విశ్వవిజేత ఎవరో?

సెమీస్లో ఆసీస్పై గెలుపుతో హర్మన్ సేన నిన్న ఫైనల్లోకి అడుగు పెట్టి SAతో NOV 2న తలపడనున్న విషయం తెలిసిందే. 1973 నుంచి మహిళల వరల్డ్ కప్ జరుగుతుండగా కేవలం 3 జట్లే విజేతలుగా నిలిచాయి.
1973: ఇంగ్లండ్, 1978: ఆస్ట్రేలియా, 1982: ఆస్ట్రేలియా, 1988: ఆస్ట్రేలియా, 1993: ఇంగ్లండ్, 1997: ఆస్ట్రేలియా, 2000: న్యూజిలాండ్, 2005: ఆస్ట్రేలియా, 2009: ఇంగ్లండ్, 2013: ఆస్ట్రేలియా, 2017: ఇంగ్లండ్, 2022: ఆస్ట్రేలియా.   
News October 31, 2025
ఆలయాల్లో ధ్వజస్తంభం ఎందుకు?

ధ్వజం అంటే పతాకం. ధ్వజస్తంభం ఉత్సవానికి సంకేతం. హైందవ సంస్కృతిలో దీని చుట్టూ ప్రదక్షిణ చేశాకే దైవదర్శనం చేసుకోవాలని చెబుతుంటారు. ఆలయోత్సవాలు మొదలయ్యేటప్పుడు ఈ స్తంభంపై జయపతాకాన్ని ఎగురవేస్తారు. ధ్వజస్తంభం లేని ఆలయాలకు స్వాములు దేవాలయ గుర్తింపు ఇవ్వరనే నమ్మకం ఉంది. దీనిని ఆలయ హృదయంగా భావిస్తారు. ఇది భక్తులకు శక్తిని, శుభాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతి ఆలయంలో దీన్ని ప్రతిష్ఠిస్తారు.
News October 31, 2025
ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: CM

AP: ఇకపై ప్రతి నెలా, ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను CM CBN ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై సమీక్షించిన ఆయన, ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలన్నారు. NOVలో జరిగే CII సదస్సులోగా పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు CMకు తెలిపారు.


