News September 22, 2024
4వ రోజు ఆట షురూ
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్టు 4వ రోజు ఆట మొదలైంది. 6 వికెట్లు చేతిలో ఉన్న బంగ్లా 357 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రస్తుత స్కోర్ 187/4గా ఉంది. క్రీజులో శాంటో(61), షకీబ్ అల్ హసన్(21) ఉన్నారు. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 328 రన్స్ చేయాలి. భారత్ గెలవాలంటే బంగ్లాను ఆలౌట్ చేయాల్సి ఉంది. అటు ఇంకో రోజు ఆట మిగిలి ఉంది. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.
Similar News
News September 22, 2024
హిందువుల మనోభావాలను దెబ్బతీశారు: హీరో
తిరుమల లడ్డూ వ్యవహారంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని వమ్ము చేస్తూ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడటం ఆందోళనకరం. ఇది లోపం కాదు. విశ్వాసాన్ని దెబ్బతీసినట్లే. హిందువులను అవమానపరిచారు. అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి బాధ్యులను గుర్తించి శిక్షించాల్సిన అవసరం ఉంది. సంప్రదాయాల ఉల్లంఘనలను సహించబోమని మనం ఒక ఉదాహరణగా నిలవాలి’ అని ట్వీట్ చేశారు.
News September 22, 2024
చంద్రబాబు పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం: VSR
AP: తప్పులు చేస్తూ ఎదుటివారి మీద నిందలు వేయడంలో చంద్రబాబు ఆద్యుడు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘100 రోజుల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రూ.40వేల కోట్ల అప్పులు చేశారు. నేరాలు దారుణంగా పెరిగిపోయాయి. మిగతా 1725 రోజుల చంద్రబాబు పాలనలో ప్రజలకు కష్టాలు, రాష్ట్ర విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోండి. చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రానికి పాలకుడిగా రావటం ప్రజల దురదృష్టం’ అని ట్వీట్ చేశారు.
News September 22, 2024
ట్రాఫిక్లో చిక్కుకున్న CM.. ఇద్దరు అధికారులు సస్పెండ్!
UP CM యోగి Sept 10న నోయిడా ఎక్స్ప్రెస్వేపై ట్రాఫిక్లో చిక్కుకున్నారు. అప్పటికే కురిసిన వర్షం వల్ల రోడ్లను వరదలు ముంచెత్తడంతో ట్రాఫిక్ జామైంది. అప్పుడే ఇండియా ఎక్స్పో మార్ట్ నుంచి తిరిగి గౌతమ్బుద్ధ వర్సిటీకి వెళుతున్న CM యోగి ట్రాఫిక్లో చిక్కుకున్నారు. దీంతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్కు ట్రాఫిక్ కారణం కాదని చెప్పడం గమనార్హం.