News April 2, 2024

అరాచకపాలనకు రోజులు దగ్గరపడ్డాయి: సత్యకుమార్ యాదవ్

image

AP: బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ యాదవ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేస్తున్న ఆయన రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై బాబుతో చర్చించినట్లు తెలిపారు. ‘ఏపీలో వైసీపీ అరాచకపాలనకు రోజులు దగ్గరపడ్డాయి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు కానుంది. అంధకారం తొలగి వెలుగులు ప్రసరించనున్నాయి’ అని సత్యకుమార్ ట్వీట్ చేశారు.

Similar News

News April 21, 2025

ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

image

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

News April 21, 2025

IPL కోసం మటన్, పిజ్జాకు వైభవ్ దూరం: కోచ్

image

RR యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి మటన్, పిజ్జా అంటే చాలా ఇష్టమని కోచ్ మనీశ్ వెల్లడించారు. గతంలో ఎంత పెట్టినా మిగిల్చేవాడు కాదని, అందుకే బొద్దుగా ఉన్నాడని తెలిపారు. IPLలో బరిలో దిగడం కోసం వాటికి దూరంగా ఉండిపోయాడన్నారు. అతనికి బ్రియాన్ లారా అంటే ఇష్టమని చెప్పారు. లారాతోపాటు యువరాజ్ మిక్సింగ్‌లా సూర్యవంశీ కనిపిస్తాడని పేర్కొన్నారు. అతను తప్పకుండా ఎక్కువకాలం క్రికెట్ ఆడతాడని ధీమా వ్యక్తం చేశారు.

News April 21, 2025

కాల్పుల విరమణలోనూ రష్యా దాడులు: జెలెన్‌స్కీ

image

ఈస్టర్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన <<16153897>>కాల్పుల విరమణ<<>> బూటకమని ఉక్రెయిన్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. తమ భూభాగంలో ఆదివారం 50కి పైగా బాంబులు, డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. వైమానిక దాడులు జరగకపోవడం ఊరట కలిగించే అంశమని చెప్పారు. క్షేత్రస్థాయిలో పుతిన్‌ సైన్యంపై పట్టు కోల్పోయినట్లు కనిపిస్తోందన్నారు. ఆ దేశానికి యుద్ధానికి ముగింపు పలికే ఆలోచన లేదని పేర్కొన్నారు.

error: Content is protected !!