News August 29, 2024
సెంట్రల్ జైళ్లలో డీఅడిక్షన్ సెంటర్లు

AP: రాజమహేంద్రవరం, విశాఖ, నెల్లూరు, కడప సెంట్రల్ జైళ్లలో డీఅడిక్షన్ సెంటర్లు సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.2.45 లక్షల చొప్పున నాలుగింటికి కలిపి రూ.9.80 లక్షల వ్యయం కానుంది. కేంద్ర కారాగారాల్లో గంజాయికి అలవాటు పడిన ఖైదీలు చాలామంది ఉన్నారు. దీంతో జైలులోనే వారికి కౌన్సెలింగ్, వ్యసన విముక్తి కలిగించేలా ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు.
Similar News
News February 4, 2026
అదానీ డేటా సెంటర్కు భూ కేటాయింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

AP: విశాఖ జిల్లాలో 480 ఎకరాలను డేటా సెంటర్ కోసం అదానీ గ్రూప్ కంపెనీలకు ఉచితంగా కేటాయించడంపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ ధీరజ్ సింగ్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం ఆదేశించింది. పాలసీ ప్రకారం ఉచితంగా భూమి ఇచ్చే అధికారం GOVTకు లేదని న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదించారు. సేల్డీడ్ రాస్తే ప్రాజెక్టు పూర్తికాకున్నా వెనక్కి తీసుకొనే అధికారం ఉండదని తెలిపారు.
News February 4, 2026
వెనిజులా ఆయిల్ కొంటే $3 బిలియన్లు ఆదా: SBI రిపోర్ట్

రష్యాకు బదులు వెనిజులా చమురు కొనుగోలు చేస్తే భారత్కు ఏటా 3 బిలియన్ డాలర్లు ఆదా అవుతుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. బ్యారెల్పై 10-12 డాలర్ల డిస్కౌంట్ లభిస్తేనే ఇది సాధ్యమని లేదంటే కష్టమని పేర్కొంది. అయితే రష్యా, మిడిల్ ఈస్ట్తో పోలిస్తే వెనిజులా భారత్కు దూరంగా ఉండటం, రవాణా భారం ఉండటం మైనస్ అని పేర్కొంది. అయితే వెనిజులా ఆయిల్ భారత్కు ప్రత్యామ్నాయంగా ఉంటుందని తెలిపింది.
News February 4, 2026
ఆన్లైన్ గేమ్స్తో జాగ్రత్త బాస్

ఆన్లైన్ గేమింగ్ మాయలో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు <<19045678>>సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సూసైడ్ డెస్టినేషన్ గేమ్స్ పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అందుకే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలు పిల్లలు SM వాడకుండా కఠిన నిబంధనలు తెచ్చాయి. మన దగ్గర కూడా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారన్నది ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారికి డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించాలి.


